News October 20, 2024
టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఆలపాటి, పేరాబత్తుల ఖరారు

AP: పట్టభద్ర MLC స్థానాలకు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్(కృష్ణా-గుంటూరు), పేరాబత్తుల రాజశేఖర్(ఉ.గో) పేర్లను టీడీపీ అధిష్ఠానం ఖరారుచేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఓ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల్లో ఆలపాటి తెనాలి, రాజశేఖర్ కాకినాడ రూరల్ స్థానాలను ఆశించారు. అయితే పొత్తులో భాగంగా ఆ సీట్లు జనసేనకు వెళ్లిన విషయం తెలిసిందే.
Similar News
News November 25, 2025
ASF కార్మికుల బీమా పెంపు

భవన నిర్మాణ, ఇతర కార్మికుల సంక్షేమంపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. సోమవారం కలెక్టరేట్లో కార్మిక భీమా పెంపు, కార్మికుల సంక్షేమంపై కార్మిక శాఖ అధికారులు, భవన నిర్మాణ కార్మిక సంఘాల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం సహజ మరణానికి అందించే సాయాన్ని రూ.లక్ష నుంచి రూ.2 లక్షలకు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.6 నుంచి రూ.10 లక్షలకు పెంచినట్లు వెల్లడించారు.
News November 25, 2025
₹5వేల నోటు రానుందా? నిజమిదే

RBI కొత్తగా ₹5వేల నోట్లను విడుదల చేయబోతోందన్న ప్రచారాన్ని PIB ఫ్యాక్ట్ చెక్ విభాగం ఖండించింది. ఈ ప్రచారంలో నిజం లేదని, ₹5,000 నోట్లకు సంబంధించి RBI ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. ఏదైనా ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కోసం RBI సైట్ను విజిట్ చేయాలని సూచించింది. కాగా 2016లో కేంద్రం ₹500, ₹1000 నోట్లను డీమానిటైజ్ చేసి, ఆ తర్వాత ₹2,000 నోట్లను తీసుకొచ్చింది. వాటిని 2023 మేలో ఉపసంహరించుకుంది.
News November 25, 2025
ఉత్తర తెలంగాణకు రూ.10,000కోట్ల NH ప్రాజెక్టులు

తెలంగాణలో రూ.10,034 కోట్ల అంచనా వ్యయంతో 4 కీలక జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. NH-167(MBNR-గుడెబల్లూర్ -80kms) ₹2,662 కోట్లు, NH-63 (అర్మూర్-జగిత్యాల, 71kms) ₹2,338 కోట్లు, NH-63 (జగిత్యాల-మంచిర్యాల, 68kms) ₹2,550 కోట్లు, NH-563 (JGL-KNR, 59kms)కి ₹2,484 కోట్లతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కొత్త NHలు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రవాణా కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరుస్తాయి.


