News October 20, 2024
టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఆలపాటి, పేరాబత్తుల ఖరారు

AP: పట్టభద్ర MLC స్థానాలకు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్(కృష్ణా-గుంటూరు), పేరాబత్తుల రాజశేఖర్(ఉ.గో) పేర్లను టీడీపీ అధిష్ఠానం ఖరారుచేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఓ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల్లో ఆలపాటి తెనాలి, రాజశేఖర్ కాకినాడ రూరల్ స్థానాలను ఆశించారు. అయితే పొత్తులో భాగంగా ఆ సీట్లు జనసేనకు వెళ్లిన విషయం తెలిసిందే.
Similar News
News December 13, 2025
చిత్తూరు జిల్లాలో యూరియా కొరత లేదు

చిత్తూరు జిల్లాలో ఇప్పటివరకు ఎటువంటి ఎరువులు, యూరియా కొరత లేదని జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. 2నెలల కాలంలో జిల్లాలో 4135 మెట్రిక్ టన్నుల యూరియా విక్రయాలు జరిగినట్టు చెప్పారు. రాబోయే 21 రోజులకు 1,247 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా.. 2,117 టన్నులు అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. ఎవరైనా కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News December 13, 2025
KMM: 2వ దశ ఎన్నికలు.. 2,023 బ్యాలెట్ బాక్సులు సిద్ధం.!

2వ దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు 2,023 బ్యాలెట్ బాక్సులు, 1,831 పోలింగ్ అధికారులు, 2,346 మంది OPOలను సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. 28 లొకేషన్స్లో 304 క్రిటికల్ కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. మొత్తం 2,51,327మంది ఓటర్లు ఉన్నారని, ఇందులో 1,21,164మంది పురుష, 1,30,156మంది మహిళా, 7 గురు ఇతర ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్కు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు.
News December 13, 2025
KMM: 2వ దశ ఎన్నికలు.. 2,023 బ్యాలెట్ బాక్సులు సిద్ధం.!

2వ దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు 2,023 బ్యాలెట్ బాక్సులు, 1,831 పోలింగ్ అధికారులు, 2,346 మంది OPOలను సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. 28 లొకేషన్స్లో 304 క్రిటికల్ కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. మొత్తం 2,51,327మంది ఓటర్లు ఉన్నారని, ఇందులో 1,21,164మంది పురుష, 1,30,156మంది మహిళా, 7 గురు ఇతర ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్కు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు.


