News July 31, 2024
30 వేల మంది అమ్మాయిల మిస్సింగ్ ఆరోపణలు అబద్ధం: YCP
AP: రాష్ట్రంలో 30 వేల మంది అమ్మాయిలు మాయమైనట్లు పవన్ కళ్యాణ్ సహా కూటమి నేతలు చేసిన ఆరోపణలు అవాస్తవమని కేంద్రం స్పష్టం చేసిందని వైసీపీ ట్వీట్ చేసింది. 2019 నుంచి 2023 వరకు 44,685 మిస్సింగ్ ఫిర్యాదులు రాగా, 44,022 మందిని ట్రేస్ చేసినట్లు లోక్సభలో కేంద్ర మంత్రి బండి సంజయ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారని పేర్కొంది. ‘దీనిపై తప్పుడు ప్రచారాలు చేసినవారు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు?’ అని ప్రశ్నించింది.
Similar News
News February 1, 2025
చంద్రబాబు సిగ్గుపడాలి: అంబటి రాంబాబు
AP: బడ్జెట్ కేటాయింపుల్లో ఏపీ కంటే బిహార్ ఎక్కువ సాధించిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. ఇందులో నితీశ్ కుమార్ విజయాన్ని చూసి CM చంద్రబాబు సిగ్గుపడాలన్నారు. మరోవైపు, తమ నలుగురు కార్పొరేటర్లను టీడీపీలో చేర్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెమ్మసాని కార్పొరేటర్ స్థాయికి దిగిపోయారని ఎద్దేవా చేశారు. తిరుపతి Dy. మేయర్గా పోటీ చేయాలనుకుంటే శేఖర్ రెడ్డి ఇంటిని కూల్చేశారని మండిపడ్డారు.
News February 1, 2025
క్రికెట్కు గుడ్బై: సాహా
భారత క్రికెటర్ వృద్ధిమాన్ సాహా అన్ని ఫార్మాట్ల క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. 28 ఏళ్ల పాటు స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ, క్లబ్, డిస్ట్రిక్ట్, స్టేట్, అంతర్జాతీయ మ్యాచ్లు ఆడారు. IPLలో KKR, SRH, GT, పంజాబ్కు ఆడారు. కుటుంబంతో సమయం గడిపేందుకు, జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభిస్తున్నట్లు Xలో పోస్ట్ పెట్టారు. సాహా 40 టెస్టుల్లో 1,353 పరుగులు, 9 ODIల్లో 41, 122 FC మ్యాచుల్లో 6,423 రన్స్ చేశారు.
News February 1, 2025
16 మంది MPలు తెచ్చింది గుండుసున్నా: KTR
TG: సీఎం, తెలంగాణ ఎంపీలు కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి చిల్లిగవ్వ సాధించలేదని KTR మండిపడ్డారు. వారు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘కాంగ్రెస్, బీజేపీ నుంచి ఉన్న 16 మంది MPలు తెచ్చింది గుండుసున్నా. జాతీయ పార్టీలు ఎప్పటికీ తెలంగాణ ప్రయోజనాలు కాపాడలేవు. బడే భాయ్- చోటే భాయ్ బంధంతో ఏం లాభం లేదు. కేంద్రానికి తెలంగాణపై చిన్నచూపు మరోమారు రుజువైంది’ అని కేటీఆర్ విమర్శించారు.