News October 29, 2024

అడిగినన్ని టికెట్లు ఇవ్వలేదనే ఆరోపణలు: TTD

image

AP: TTD అదనపు ఈవో వెంకయ్య చౌదరిపై శ్రీకాకుళం జిల్లా ఆనందాశ్రమ పీఠాధిపతులు చేసిన ఆరోపణలపై టీటీడీ స్పందించింది. ‘స్వామీజీ 50 మందికి బ్రేక్ దర్శనం, 550 మందికి ప్రత్యేక ప్రవేశ దర్శనంతో పాటు తిరుమలలో వసతి కల్పించాలని కోరారు. ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సంఖ్యను తగ్గించాలని అదనపు ఈవో కోరారు. స్వామీజీ కోపంతో మీడియా సమక్షంలో అదనపు ఈవోను కించపరుస్తూ మాట్లాడారు’ అని పేర్కొంది.

Similar News

News December 15, 2025

ఫేస్ క్రీమ్ వాడుతున్నారా?

image

చర్మం తాజాగా, ఆరోగ్యంగా ఉండాలని అందరూ రకరకాల క్రీములు వాడుతుంటారు. అయితే కొన్ని క్రీములను కలిపి రాస్తే అదనపు ప్రయోజనాలుంటాయని నిపుణులు సూచిస్తున్నారు. ముడతలు ఎక్కువగా ఉన్నవారు విటమిన్-సీ ఉన్న క్రీములతో పాటు సన్‌స్క్రీన్ లోషన్ కలిపి రాయాలి. చర్మం మృదువుగా ఉండాలంటే రెటినాల్, పెప్టైడ్ క్రీములు ఎంచుకోండి. అయితే రెటినాల్‌ను రాత్రే రాయాలి. డ్రై స్కిన్ ఉంటే హైలురోనిక్ యాసిడ్‌, AHA, BHA ఉన్నవి ఎంచుకోండి.

News December 15, 2025

తిరిగి వస్తాం.. మీ ప్రేమకు ధన్యవాదాలు: మెస్సీ

image

అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ మూడు రోజుల భారత పర్యటన విజయవంతంగా ముగిసింది. ఈ మూడు రోజుల్లో కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీలో పర్యటించగా.. భారతీయ అభిమానుల నుంచి వచ్చిన ప్రేమకు ముగ్ధులయ్యారు. ‘మేము మీ ప్రేమనంతా మాతో తీసుకెళ్తున్నాం. కచ్చితంగా తిరిగివస్తాం. మ్యాచ్ ఆడటానికి లేదా మరే సందర్భంలోనైనా ఇండియాను సందర్శిస్తాం’ అంటూ అభిమానులకు మెస్సీ ధన్యావాదాలు తెలిపారు.

News December 15, 2025

రేవంత్‌ ప్రభుత్వంపై కవిత విమర్శలు

image

సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ పనితీరుపై కవిత విమర్శలు చేశారు. ‘#AskKavitha’లో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. ‘వాగ్దానాలు నెరవేరలేదు. కమిట్మెంట్స్ అన్నీ విఫలమయ్యాయి. ప్రజలు ప్రభుత్వం పట్ల అసంతృప్తితో ఉన్నారు’ అని ధ్వజమెత్తారు. హీరో రామ్ చరణ్ గురించి మరొకరు అడగ్గా ‘ఆయన ఎంతో వినయంగా ఉంటారు. గొప్ప డాన్సర్. కానీ నేను చిరంజీవి అభిమానిని కాబట్టి ఆయనే గొప్ప’ అని బదులిచ్చారు.