News October 29, 2024

అడిగినన్ని టికెట్లు ఇవ్వలేదనే ఆరోపణలు: TTD

image

AP: TTD అదనపు ఈవో వెంకయ్య చౌదరిపై శ్రీకాకుళం జిల్లా ఆనందాశ్రమ పీఠాధిపతులు చేసిన ఆరోపణలపై టీటీడీ స్పందించింది. ‘స్వామీజీ 50 మందికి బ్రేక్ దర్శనం, 550 మందికి ప్రత్యేక ప్రవేశ దర్శనంతో పాటు తిరుమలలో వసతి కల్పించాలని కోరారు. ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సంఖ్యను తగ్గించాలని అదనపు ఈవో కోరారు. స్వామీజీ కోపంతో మీడియా సమక్షంలో అదనపు ఈవోను కించపరుస్తూ మాట్లాడారు’ అని పేర్కొంది.

Similar News

News December 11, 2025

సర్పంచ్ ఎన్నికలు.. తల్లిపై కూతురి విజయం

image

TG: పంచాయతీ ఎన్నికల్లో ఆసక్తికర ఫలితాలు వెలువడుతున్నాయి. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం <<18450009>>తిమ్మయ్యపల్లిలో<<>> తల్లి గంగవ్వపై కూతురు పల్లెపు సుమ విజయం సాధించారు. ఇద్దరిమధ్య హోరాహోరీగా పోరు జరగగా తల్లిపై కూతురు 91 ఓట్ల తేడాతో విజయఢంకా మోగించారు. సుమ గతంలో గ్రామానికే చెందిన యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో ఇరు కుటుంబాల మధ్య విభేదాలు నెలకొన్నాయి. దీంతో రెండు కుటుంబాలు ఎన్నికల్లో ఢీకొన్నాయి.

News December 11, 2025

ఛార్జీలు పెంచబోమని ‘సర్దుబాటు’ బాదుడా: షర్మిల

image

AP: విద్యుత్ ఛార్జీలు పెంచబోమంటూ ఓ పక్క CM CBN ప్రకటనలు చేస్తూ మరోపక్క సర్దుబాటు పేరిట ప్రజలపై భారం మోపేందుకు సిద్ధమవ్వడం దారుణమని PCC చీఫ్ షర్మిల విమర్శించారు. ‘సర్దుబాటు పేరుతో ఇప్పటికే ₹15000 కోట్లు వసూలు చేసి ప్రజలను ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు మళ్లీ మరో ₹15651 కోట్ల సర్దుబాటు ఛార్జీలకు APERC రంగం సిద్ధం చేసింది. ఈమేరకు ప్రజలనుంచి అభిప్రాయాలకు నోటీసు జారీచేసింది.’ అని షర్మిల దుయ్యబట్టారు.

News December 11, 2025

DRDOపై స్టాండింగ్ డిఫెన్స్ కమిటీ ప్రశంసలు

image

హైపర్ సోనిక్ మిస్సైల్స్ తయారీ, అధునాతన టెక్నాలజీతో రక్షణ వ్యవస్థ ఏర్పాటులో DRDO సాధించిన ప్రగతిని డిఫెన్స్ స్టాండింగ్ కమిటీ ప్రశంసించింది. రక్షణ పరికరాల తయారీకి విదేశాల నుంచి దిగుమతులు తగ్గించడం ద్వారా 5 ఏళ్లలో రూ.2,64,156 కోట్లు ఆదా చేసిందని రిపోర్టులో పేర్కొంది. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా దేశీయ రక్షణ సామర్థ్యాలను పెంచుకునేందుకు నిధులతోపాటు నైపుణ్యం ఉన్న ఉద్యోగులను DRDO కోరుతోందని తెలిపింది.