News October 29, 2024
అడిగినన్ని టికెట్లు ఇవ్వలేదనే ఆరోపణలు: TTD

AP: TTD అదనపు ఈవో వెంకయ్య చౌదరిపై శ్రీకాకుళం జిల్లా ఆనందాశ్రమ పీఠాధిపతులు చేసిన ఆరోపణలపై టీటీడీ స్పందించింది. ‘స్వామీజీ 50 మందికి బ్రేక్ దర్శనం, 550 మందికి ప్రత్యేక ప్రవేశ దర్శనంతో పాటు తిరుమలలో వసతి కల్పించాలని కోరారు. ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సంఖ్యను తగ్గించాలని అదనపు ఈవో కోరారు. స్వామీజీ కోపంతో మీడియా సమక్షంలో అదనపు ఈవోను కించపరుస్తూ మాట్లాడారు’ అని పేర్కొంది.
Similar News
News December 24, 2025
సంక్రాంతి తర్వాత సర్పంచ్లకు ట్రైనింగ్

TG: ఇటీవల జరిగిన ఎన్నికల్లో సర్పంచ్లగా ఎన్నికైన వారికి సంక్రాంతి తర్వాత పల్లెల్లో పాలన, నిధుల వినియోగం, అభివృద్ధి, గ్రామసభల నిర్వహణ తదితరాలపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో ట్రైనింగ్ ఇవ్వనున్నారు. జిల్లాల వారీగా ఒక్కో బ్యాచ్లో 50 నుంచి 100 మంది ఉండేలా శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సర్పంచులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం జరిగిన తర్వాతే ఈ శిక్షణ కార్యక్రమం ప్రారంభం కానుంది.
News December 24, 2025
ఎద్దు ఎండకులాగ, దున్న నీడకు లాగ

ఎద్దు ఎంతటి కష్టాన్నైనా ఓర్చుకుని ఎండలో కూడా పని చేస్తుంది. ఇది కష్టపడే తత్వానికి నిదర్శనం. దున్నపోతుకు కాస్త ఎండ తగిలినా భరించలేదు, అది ఎప్పుడూ నీడ కోసం లేదా నీళ్ల కోసం(చల్లదనం కోసం) వెతుకుతుంది. ఇది సుఖాన్ని కోరుకునే తత్వానికి నిదర్శనం. ఒకే ఇంట్లో లేదా ఒకే చోట ఉన్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు ఎంతో కష్టపడే స్వభావం కలిగి ఉంటే, మరొకరు సోమరిగా ఉంటూ సుఖాన్ని కోరుకుంటున్నారని చెప్పడానికి ఈ సామెత వాడతారు.
News December 24, 2025
కొత్త సంవత్సరంలో ఇంట్లోకి ఇవి తెచ్చుకోండి

న్యూ ఇయర్లో అదృష్టం వరించాలంటే ఇంట్లోకి శ్రీయంత్రం, శాలిగ్రామం, స్వస్తిక్ గుర్తులను తీసుకురావాలని పండితులు, వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. వీటి వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుందని అంటున్నారు. ‘ఇంటి ఆవరణలో తులసి, మనీ ప్లాంట్, స్నేక్ ప్లాంట్, లక్కీ బ్యాంబూ మొక్కలు నాటండి. తులసి కోట వద్ద శాలిగ్రామాన్ని ఉంచి పూజిస్తే విష్ణుమూర్తి ఆశీస్సులు లభిస్తాయి’ అని చెబుతున్నారు.


