News October 29, 2024
అడిగినన్ని టికెట్లు ఇవ్వలేదనే ఆరోపణలు: TTD

AP: TTD అదనపు ఈవో వెంకయ్య చౌదరిపై శ్రీకాకుళం జిల్లా ఆనందాశ్రమ పీఠాధిపతులు చేసిన ఆరోపణలపై టీటీడీ స్పందించింది. ‘స్వామీజీ 50 మందికి బ్రేక్ దర్శనం, 550 మందికి ప్రత్యేక ప్రవేశ దర్శనంతో పాటు తిరుమలలో వసతి కల్పించాలని కోరారు. ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సంఖ్యను తగ్గించాలని అదనపు ఈవో కోరారు. స్వామీజీ కోపంతో మీడియా సమక్షంలో అదనపు ఈవోను కించపరుస్తూ మాట్లాడారు’ అని పేర్కొంది.
Similar News
News December 19, 2025
దూసుకెళ్తున్న టైర్ల కంపెనీల షేర్లు

టైర్ల కంపెనీల షేర్లు శుక్రవారం భారీ లాభాల్లో దూసుకెళ్తున్నాయి. ఇంట్రాడేలో JK టైర్ 7%, సియట్ 5%, అపోలో టైర్స్ 3%, TVS శ్రీచక్ర 3%, MRF 2% వరకు పెరిగాయి. ఇటీవల రబ్బర్ వంటి ముడి పదార్థాల ఖర్చుతో పాటు GST తగ్గడం, వాహనాల అమ్మకాలు పెరగడం వంటి సానుకూల అంశాలు టైర్ కంపెనీల షేర్ల ర్యాలీకి కారణమవుతున్నాయి. నెక్స్ట్ క్వార్టర్లో ఆయా కంపెనీల లాభాలు భారీగా పెరిగే అవకాశం ఉందని ఇన్వెస్టర్లు అంచనా వేస్తున్నారు.
News December 19, 2025
గ్యాస్ గీజర్లు ప్రాణాంతకం.. ఎందుకంటే?

స్నానం చేసేటప్పుడు అకస్మాత్తుగా తల తిరగడం, స్పృహ తప్పడం సాధారణ విషయం కాదని, ఇది ‘గ్యాస్ గీజర్ సిండ్రోమ్’ కావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘గ్యాస్ గీజర్ల నుంచి విడుదలయ్యే రంగు, వాసన లేని కార్బన్ మోనాక్సైడ్(CO) ప్రాణాంతకంగా మారుతుంది. బాత్రూమ్లో సరైన వెంటిలేషన్ లేకపోతే ఈ విషవాయువు నిశ్శబ్దంగా ప్రాణాలు తీస్తుంది. వీలైనంత వరకు ఎలక్ట్రిక్ గీజర్లను వాడటం మంచిది’ అని సూచిస్తున్నారు. SHARE IT
News December 19, 2025
కేంద్ర నూతన బడ్జెట్కు రాష్ట్ర ప్రతిపాదనలు

TG: నూతన బడ్జెట్లో రాష్ట్ర సమస్యలకు పరిష్కారం చూపేలా కేంద్రం ముందు పలు డిమాండ్లు పెట్టేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. ప్రీ బడ్జెట్ సమావేశాల్లో సమర్పించేందుకు కొన్ని డిమాండ్లతో నివేదిక సిద్ధం చేసింది. GST సవరణతో ఏర్పడిన నిధుల లోటు భర్తీ, మెట్రో విస్తరణ, బయ్యారం స్టీల్ ప్లాంట్, డ్రైపోర్టు, బందర్ నుంచి అక్కడికి హైవే ఏర్పాటు, విభజన చట్టంలోని అంశాలను అందులో పొందుపరిచింది.


