News October 29, 2024
అడిగినన్ని టికెట్లు ఇవ్వలేదనే ఆరోపణలు: TTD

AP: TTD అదనపు ఈవో వెంకయ్య చౌదరిపై శ్రీకాకుళం జిల్లా ఆనందాశ్రమ పీఠాధిపతులు చేసిన ఆరోపణలపై టీటీడీ స్పందించింది. ‘స్వామీజీ 50 మందికి బ్రేక్ దర్శనం, 550 మందికి ప్రత్యేక ప్రవేశ దర్శనంతో పాటు తిరుమలలో వసతి కల్పించాలని కోరారు. ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సంఖ్యను తగ్గించాలని అదనపు ఈవో కోరారు. స్వామీజీ కోపంతో మీడియా సమక్షంలో అదనపు ఈవోను కించపరుస్తూ మాట్లాడారు’ అని పేర్కొంది.
Similar News
News December 21, 2025
మళ్లీ ఇంగ్లండ్ ఓటమి.. సిరీస్ ఆసీస్ వశం

ఆస్ట్రేలియా గడ్డపై ఇంగ్లండ్ ఓటముల పరంపర కొనసాగుతోంది. మూడో టెస్టులోనూ ఆసీస్ 82 పరుగుల తేడాతో విజయం సాధించి మరో 2 టెస్టులు మిగిలి ఉండగానే యాషెస్ సిరీస్ను కైవసం చేసుకుంది. రెండో ఇన్నింగ్స్లో క్రాలీ(85), జేమీ స్మిత్(60), విల్ జాక్స్(47), కార్స్(39), రూట్(39) పరుగులు చేశారు.
స్కోర్లు: ఆసీస్ 371/10, 349/10; ఇంగ్లండ్ 286/10, 352/10
News December 21, 2025
శ్రీనిధి రకం కోళ్ల ప్రత్యేకత ఏమిటి?

శ్రీనిధి జాతి కోళ్లు గోధుమ రంగులో ఉంటాయి. నాటుకోడి గుడ్లకు సమానంగా ఈ కోడి గుడ్లు కూడా అధిక పోషకాలను కలిగి ఉంటాయి. ఈ కోళ్లు 5 నెలల వయసు నుంచే గుడ్లను పెట్టడం ప్రారంభిస్తాయి. ఏడాదికి 140 నుంచి 160 గుడ్లను పెడతాయి. అన్ని వాతావరణ పరిస్థితులను, కొన్ని రకాల వ్యాధులను తట్టుకొని జీవిస్తాయి. పొడవైన కాళ్లతో, ఆకర్షణీయంగా ఉంటాయి. పెరటికోళ్లు పెంచాలనుకునేవారికి శ్రీనిధి కోళ్లు కూడా అనుకూలమైనవి.
News December 21, 2025
సూపర్ ఫామ్లో కాన్వే.. మరో సెంచరీ

వెస్టిండీస్తో మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్లోనూ NZ ఓపెనర్ కాన్వే సెంచరీ చేశారు. 136 బంతుల్లో (8 ఫోర్లు, 3 సిక్సులు) సెంచరీ మార్క్ అందుకున్నారు. తొలి ఇన్నింగ్స్లో ఆయన <<18609470>>డబుల్ సెంచరీ<<>> సాధించారు. దీంతో ఒకే టెస్టులో డబుల్ సెంచరీ, సెంచరీ సాధించిన తొలి కివీస్ ప్లేయర్గా రికార్డు సృష్టించారు. కాగా ఈ మాజీ CSK ప్లేయర్ ఇటీవల జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో అన్సోల్డ్గా మిగిలిన సంగతి తెలిసిందే.


