News October 29, 2024

అడిగినన్ని టికెట్లు ఇవ్వలేదనే ఆరోపణలు: TTD

image

AP: TTD అదనపు ఈవో వెంకయ్య చౌదరిపై శ్రీకాకుళం జిల్లా ఆనందాశ్రమ పీఠాధిపతులు చేసిన ఆరోపణలపై టీటీడీ స్పందించింది. ‘స్వామీజీ 50 మందికి బ్రేక్ దర్శనం, 550 మందికి ప్రత్యేక ప్రవేశ దర్శనంతో పాటు తిరుమలలో వసతి కల్పించాలని కోరారు. ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సంఖ్యను తగ్గించాలని అదనపు ఈవో కోరారు. స్వామీజీ కోపంతో మీడియా సమక్షంలో అదనపు ఈవోను కించపరుస్తూ మాట్లాడారు’ అని పేర్కొంది.

Similar News

News December 15, 2025

లోయలో పడిన స్కూల్ బస్సు.. 17 మంది మృతి

image

కొలంబియాలోని ఆంటియోక్వియాలో ఘోర ప్రమాదం జరిగింది. టూర్ నుంచి వస్తున్న స్కూల్ బస్సు లోయలో పడటంతో 17 మంది మృతి చెందారు. వీరిలో ఎక్కువ మంది 16-18 ఏళ్లలోపు పిల్లలేనని అధికారులు తెలిపారు. మరో 20 మంది గాయపడ్డారని చెప్పారు. వారికి సమీప ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. బీచ్‌లో గ్రాడ్యుయేషన్ వేడుకలు చేసుకుని వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు గవర్నర్ ఆండ్రెస్ జూలియన్ వెల్లడించారు.

News December 15, 2025

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 3 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. వీటిలో ఫ్యాకల్టీ, ఆఫీస్ అసిస్టెంట్, వాచ్‌మన్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి 7వ తరగతి, డిగ్రీ, పీజీ (MSW/MA-రూరల్ డెవలప్‌మెంట్/సోషియాలజీ/సైకాలజీ) BEd ఉత్తీర్ణులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయసు 22-40ఏళ్ల మధ్య ఉండాలి. వెబ్‌సైట్: https://centralbank.bank.in/

News December 15, 2025

ఒక్క ఓటుతో సర్పంచ్ పీఠం

image

TG: హోరాహోరీగా సాగుతున్న పంచాయతీ ఎన్నికల్లో పలువురు అభ్యర్థులు ఒక్క ఓటుతో గెలిచారు. కరీంనగర్ జిల్లాలోనే ఐదుగురు ఇలా సర్పంచ్ పీఠం ఎక్కారు. కొత్తపల్లిలో శోభారాణి, పెద్దూరుపల్లిలో రామడుగు హరీశ్, మహాత్మనగర్‌లో పొన్నాల సంపత్, ముంజంపల్లిలో నందగిరి కనక లక్ష్మి, అంబల్ పూర్‌లో వెంకటేశ్ ఓటు తేడాతో విజయం సాధించారు. వరంగల్(D) ఆశాలపల్లి కొంగర మల్లమ్మ, నల్గొండ(D) ధన్‌సింగ్ తండాలో ధనావత్ కూడా ఇలా గెలిచారు.