News October 29, 2024

అడిగినన్ని టికెట్లు ఇవ్వలేదనే ఆరోపణలు: TTD

image

AP: TTD అదనపు ఈవో వెంకయ్య చౌదరిపై శ్రీకాకుళం జిల్లా ఆనందాశ్రమ పీఠాధిపతులు చేసిన ఆరోపణలపై టీటీడీ స్పందించింది. ‘స్వామీజీ 50 మందికి బ్రేక్ దర్శనం, 550 మందికి ప్రత్యేక ప్రవేశ దర్శనంతో పాటు తిరుమలలో వసతి కల్పించాలని కోరారు. ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సంఖ్యను తగ్గించాలని అదనపు ఈవో కోరారు. స్వామీజీ కోపంతో మీడియా సమక్షంలో అదనపు ఈవోను కించపరుస్తూ మాట్లాడారు’ అని పేర్కొంది.

Similar News

News December 12, 2025

కొండంత లక్ష్యం.. నంబర్-3లో అక్షర్ పటేలా?

image

SA 2వ T20లో 214 పరుగుల భారీ లక్ష్యం ముందు ఉంచితే, IND జట్టు ఫాలో అయిన స్ట్రాటజీ వింతగా ఉందని క్రీడా వర్గాలు విమర్శిస్తున్నాయి. గిల్ తొలి ఓవర్లోనే ఔటైతే SKYకి బదులు అక్షర్ నం.3లో రావడమేంటని ప్రశ్నిస్తున్నాయి. సూర్య కాకపోయినా తిలక్, హార్దిక్, జితేశ్‌ ఉండగా ఈ మూవ్ ఏంటో అంతుచిక్కడం లేదని అభిప్రాయపడుతున్నాయి. తొలి బంతి నుంచే తడబడిన అక్షర్ 21బంతుల్లో 21పరుగులే చేసి వెనుదిరిగారు. దీనిపై మీ COMMENT.

News December 12, 2025

వరి నాట్లు వేసేటప్పుడు జాగ్రత్తలు(1/2)

image

వరి నారుమడి నుంచి నారు తీసే వారం రోజుల ముందు.. ఎకరానికి సరిపడా నారుమడికి కిలో కార్బోఫ్యూరాన్ 3జి గుళికలు వేసి నీరు పెట్టి ఇంకించాలి. దీని వల్ల పొలంలో నెలవరకూ పైరును పురుగులు ఆశించవు. వరి రకాల పంట కాలాన్ని బట్టి 22-28 రోజుల వయసుగల నారును నాట్లు వేసుకోవాలి. నారుమడి నుంచి పెరికిన నారు కట్టలను నానో DAP ద్రావణంలో(లీటరు నీటికి 4ml) 15 నిమిషాలు ముంచి నాటితే పొలంలో పైరు తొందరగా వేర్లు తొడిగి నాటుకుంటాయి.

News December 12, 2025

టెన్త్ అర్హతతో 714 పోస్టులకు నోటిఫికేషన్

image

ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ (<>DSSSB<<>>) 714 MTS పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్ అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 17 నుంచి జనవరి 15వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 27ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.18,000-రూ.56,900 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://dsssbonline.nic.in.