News October 29, 2024

అడిగినన్ని టికెట్లు ఇవ్వలేదనే ఆరోపణలు: TTD

image

AP: TTD అదనపు ఈవో వెంకయ్య చౌదరిపై శ్రీకాకుళం జిల్లా ఆనందాశ్రమ పీఠాధిపతులు చేసిన ఆరోపణలపై టీటీడీ స్పందించింది. ‘స్వామీజీ 50 మందికి బ్రేక్ దర్శనం, 550 మందికి ప్రత్యేక ప్రవేశ దర్శనంతో పాటు తిరుమలలో వసతి కల్పించాలని కోరారు. ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సంఖ్యను తగ్గించాలని అదనపు ఈవో కోరారు. స్వామీజీ కోపంతో మీడియా సమక్షంలో అదనపు ఈవోను కించపరుస్తూ మాట్లాడారు’ అని పేర్కొంది.

Similar News

News December 24, 2025

సీఎంలు చంద్రబాబు, రేవంత్ క్రిస్మస్ విషెస్

image

ప్రజలకు ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రీస్తు చూపిన ప్రేమ, క్షమ, సహనం, సేవ వంటి విలువలు ఈనాటి సమాజానికి మరింత అవసరమని CBN అన్నారు. ఏసు బోధనలను అనుసరించి అన్ని మతాల సంక్షేమం, అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని రేవంత్ తెలిపారు. అటు BRS చీఫ్ కేసీఆర్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.

News December 24, 2025

బాధితులను క్రిమినల్స్‌గా చూడటం న్యాయమా: రాహుల్ గాంధీ

image

రేపిస్టులకు బెయిల్ ఇవ్వడం, బాధితులను క్రిమినల్స్‌గా చూడటం ఏ విధమైన న్యాయమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ‘నిందితుడికి బెయిల్ ఇవ్వడంపై నిరసన వ్యక్తం చేస్తున్న ‘‘ఉన్నావ్’’ అత్యాచార బాధితురాలితో అధికారులు వ్యవహరించిన తీరు కరెక్టేనా? న్యాయం కోరడమే ఆమె చేసిన తప్పా? బాధితురాలిని పదేపదే వేధించారు. ఇప్పటికీ ఆమె భయపడుతూనే బతుకుతున్నారు. నిందితుడికి బెయిల్ ఇవ్వడం సిగ్గుచేటు’ అని ఫైర్ అయ్యారు.

News December 24, 2025

20 లక్షల ఉద్యోగాల కల్పనకే ప్రాధాన్యం: CM

image

AP: మెరుగైన సేవలు వేగంగా అందించేందుకు ప్రభుత్వ శాఖలు ఇండికేటర్లను సిద్ధం చేసుకోవాలని CM చంద్రబాబు ఆదేశించారు. స్వర్ణాంధ్ర-2047, 10 సూత్రాల అమలుపై నోడల్ అధికారులతో సమీక్షించారు. ’20లక్షల ఉద్యోగాల కల్పనే మొదటి ప్రాధాన్యంగా పని చేయాలి. 10 సూత్రాల అంశాలు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలి. కీలక మిషన్‌గా నీటి భద్రత అంశంపై దృష్టి పెట్టాలి. కరవు అన్న మాట లేకుండా వరద నీటి నిర్వహణ జరగాలి’ అని సూచించారు.