News September 24, 2024
‘పళని’ ప్రసాదంపై ఆరోపణలు.. తమిళ డైరెక్టర్ అరెస్ట్!
‘పళని’ క్షేత్రంలో ఇచ్చే పంచామృతం ప్రసాదంపై ఆరోపణలు చేసిన తమిళ డైరెక్టర్ మోహన్ను తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. పురుషుల్లో వంధ్యత్వాన్ని పెంచే ఔషధాల్ని ప్రసాదంలో కలుపుతున్నారని ఓ ఇంటర్వ్యూలో ఆయన ఆరోపించారు. హిందువులపై దాడి జరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయన్ను ఈరోజు అరెస్ట్ చేశారు. ద్రౌపది, రుద్రతాండవం, బగాసురన్ వంటి సినిమాల్ని మోహన్ తీశారు. ఆయన అరెస్టును BJP ఖండించింది.
Similar News
News September 24, 2024
బాబు గారు Sit అంటే Sit, Stand అంటే Stand!: అంబటి రాంబాబు
AP: తిరుమల లడ్డూ వివాదంపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. ‘ఈ SIT బాబు గారు Sit అంటే Sit, Stand అంటే Stand!’ అని ట్వీట్ చేశారు. కాగా, లడ్డూ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం కాకుండా కేంద్రం సీబీఐతో విచారణ జరిపించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
News September 24, 2024
జియో సరికొత్త ప్లాన్
టెలికం దిగ్గజం జియో సరికొత్త ప్లాన్ను యూజర్ల కోసం తీసుకొచ్చింది. 98 రోజుల వ్యాలిడిటీతో ఉండే ఈ ప్లాన్ను రూ.999కు అందిస్తోంది. ప్లాన్లో భాగంగా అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 2GB డేటా, 100 SMSలు పంపవచ్చు. అలాగే జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్లకు ఉచితంగా యాక్సెస్ లభిస్తుంది. రీఛార్జ్ ధరలు పెంచి జియో ఇప్పటికే వినియోగదారుల నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది.
News September 24, 2024
రాజ్యసభలో తగ్గుతోన్న వైసీపీ బలం
రాజ్యసభలో వైసీపీ బలం తగ్గిపోతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత 11 నుంచి 8కి పడిపోయింది. ఇటీవల ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు వైసీపీకి రాజీనామా చేయగా, తాజాగా ఆర్.కృష్ణయ్య సైతం పార్టీని వీడారు. మరికొంత మంది కూడా వైసీపీకి గుడ్బై చెబుతారని ప్రచారం జరుగుతోంది.