News August 22, 2024

డా.ఘోష్ శవాలు అమ్ముకున్నాడని ఆరోపణలు!

image

కోల్‌క‌తా ఆర్జీ క‌ర్ మెడిక‌ల్ కాలేజీ మాజీ ప్రిన్సిప‌ల్ డా. సందీప్ ఘోష్ ఆస్ప‌త్రిలో అనాథ శవాల‌ను అమ్ముకొనేవాడ‌ని కాలేజీ మాజీ డిప్యూటీ సూపరింటెండెంట్ అక్తర్ అలీ ఆరోపించారు. అలాగే బయోమెడికల్ వ్యర్థాలను బంగ్లాదేశ్‌కు రవాణా చేసే నెట్‌వర్క్‌లో భాగం కావడం వంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాల‌కు పాల్ప‌డ్డాడ‌ని తెలిపారు. ఆస్పత్రి, కళాశాలకు సంబంధించిన ఏ పని చేయడానికైనా డబ్బులు వసూలు చేసేవాడని అలీ చెప్పారు.

Similar News

News November 25, 2025

₹5వేల నోటు రానుందా? నిజమిదే

image

RBI కొత్తగా ₹5వేల నోట్లను విడుదల చేయబోతోందన్న ప్రచారాన్ని PIB ఫ్యాక్ట్ చెక్ విభాగం ఖండించింది. ఈ ప్రచారంలో నిజం లేదని, ₹5,000 నోట్లకు సంబంధించి RBI ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. ఏదైనా ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కోసం RBI సైట్‌ను విజిట్ చేయాలని సూచించింది. కాగా 2016లో కేంద్రం ₹500, ₹1000 నోట్లను డీమానిటైజ్ చేసి, ఆ తర్వాత ₹2,000 నోట్లను తీసుకొచ్చింది. వాటిని 2023 మేలో ఉపసంహరించుకుంది.

News November 25, 2025

ఉత్తర తెలంగాణకు రూ.10,000కోట్ల NH ప్రాజెక్టులు

image

తెలంగాణలో రూ.10,034 కోట్ల అంచనా వ్యయంతో 4 కీలక జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. NH-167(MBNR-గుడెబల్లూర్ -80kms) ₹2,662 కోట్లు, NH-63 (అర్మూర్-జగిత్యాల, 71kms) ₹2,338 కోట్లు, NH-63 (జగిత్యాల-మంచిర్యాల, 68kms) ₹2,550 కోట్లు, NH-563 (JGL-KNR, 59kms)కి ₹2,484 కోట్లతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కొత్త NHలు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రవాణా కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరుస్తాయి.

News November 25, 2025

కుల్దీప్ యాదవ్ @134

image

ఇదేంటి అనుకుంటున్నారా? దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్సులో కుల్దీప్ యాదవ్ ఎదుర్కొన్న బంతుల సంఖ్య. 11 మందిలో 100 బంతులకు‌పైగా ఎదుర్కొన్నది ఆయనే కావడం గమనార్హం. 134 బంతులను ఎదుర్కొన్న కుల్దీప్ 19 పరుగులు చేశారు. జైస్వాల్ 58(97), సుందర్ 42(92) చేశారు. కాగా రెండో ఇన్నింగ్సులోనైనా వీలైనంత ఎక్కువ టైమ్ క్రీజులో ఉంటేనే భారత్ ఓటమి నుంచి తప్పించుకోవచ్చని ఫ్యాన్స్ అంటున్నారు.