News August 27, 2025
ALLERT.. 3 రోజులు జాగ్రత్తగా ఉండండి: సిద్దిపేట CP

మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిద్దిపేట సీపీ అనురాధ ప్రజలకు సూచించారు. ప్రజలు పోలీసు అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ సహకరించాలని కోరారు. వినాయక మండపాలు ఏర్పాటు చేసుకున్న ఆర్గనైజర్లు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షాలతో ఇబ్బంది ఉంటే డయల్ 100 లేదా 87126 67100కు కాల్ చేయాలని సూచించారు.
Similar News
News August 27, 2025
జగిత్యాల: గణేశ్ ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు

గణేశ్ నవరాత్రి ఉత్సవాలను ప్రజలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని, పోలీసు శాఖ తరఫున బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు చర్యలు చేపడుతున్నామని, శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రతి వినాయక మండపం నిర్వాహకులు ఆన్లైన్లో నమోదు చేసేలా అవగాహన కల్పించినట్లు వివరించారు.
మండపాల వద్ద CC కెమెరాలను ఏర్పాటు చేయాలని, రాత్రివేళల్లో మండపాల వద్ద ఉండాలన్నారు.
News August 27, 2025
VKB: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. వర్షాల కారణంగా జిల్లాలోని జలాశయాలు పూర్తిగా నిండిపోయాయని, వాగులు, కాలువలు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయన్నారు. ఈ ప్రవాహాలను దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు.
అత్యవసర పనులు ఉంటే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆయన కోరారు. మరో కొన్ని రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.
News August 27, 2025
వర్షాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ సూచన

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలకు అలుగులు పొంగుతున్నాయి. ఆర్టీసీ డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని కోరారు. హైదరాబాద్లోని నీరు నిలిచే ప్రాంతాల వద్ద జీహెచ్ఎంసీ సిబ్బంది ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.