News April 24, 2024
కూటమి ఘనవిజయం సాధించబోతోంది: పవన్

APలో తమ కూటమి ఘనవిజయం సాధించబోతోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. ‘బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. రాష్ట్ర ప్రయోజనాల కోసమే కూటమి నేతలు సీట్లు త్యాగాలు చేశారు. 30, 40 చోట్ల మా అభ్యర్థులకు సర్ది చెప్పా. వర్మ జనసేనకు మద్దతిచ్చి పిఠాపురంలో సీటు త్యాగం చేశారు. ఆయన్ను భవిష్యత్తులో ఉన్నత స్థానంలో కూర్చోబెడతాం’ అని పిఠాపురంలో నామినేషన్ అనంతరం మాట్లాడారు.
Similar News
News February 1, 2026
వంటింటి చిట్కాలు

* టమాటా, పండు మిరపకాయ పచ్చళ్లు ఎర్రగా ఉండాలంటే తాలింపులో వంటసోడా కలిపితే సరిపోతుంది.
* కూరల్లో గ్రేవీ పలచగా అయినప్పుడు కాస్త మొక్కజొన్న పిండి కలిపితే గట్టిపడుతుంది.
* ఇడ్లీ పిండి పలుచగా అయినప్పుడు దానిలో చెంచా బ్రెడ్ పొడి, పావు చెంచా మొక్కజొన్న పిండిని నీళ్లలో కలిపి చేర్చితే పిండి గట్టిగా అవడంతో పాటు ఇడ్లీలు మృదువుగా వస్తాయి.
News February 1, 2026
కొనసాగుతున్న గోల్డ్, సిల్వర్ రేట్ల పతనం

మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్(MCX) <<19015375>>ఫ్యూచర్ ట్రేడింగ్లో<<>> బంగారం, వెండి ధరల పతనం కొనసాగుతోంది. ఇవాళ వీటి రేట్లు భారీగా పడిపోయాయి. ఏప్రిల్కు సంబంధించి గోల్డ్ రేటు 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.4,834 తగ్గి రూ.1,47,511కు చేరింది. ఇక కేజీ వెండి ధర(మార్చి) రూ.26,273 క్షీణించి రూ.2,65,652 పలికింది. కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో ఆదివారం కూడా స్టాక్ మార్కెట్లు పనిచేస్తున్నాయి.
News February 1, 2026
CM కీలక నిర్ణయం: ఫలితాల తర్వాతే ఛైర్మన్లపై ప్రకటన

TG: పురపాలక ఛైర్మన్, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థుల ఎంపికపై CM రేవంత్ రెడ్డి వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాతే ఛైర్మన్, మేయర్ అభ్యర్థులను ప్రకటించాలని నాయకులను ఆదేశించారు. ఎన్నికలకు ముందే పేర్లు ప్రకటిస్తే పార్టీ ఇబ్బందుల్లో పడుతుందని సీఎం హెచ్చరించారు. చాలా మంది నాయకులు ఈ పదవుల కోసం డిమాండ్ చేస్తున్నారు.


