News April 6, 2025
జగన్ను మించి అప్పులు చేస్తున్న కూటమి: రామకృష్ణ

AP అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని CPI రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని జగన్ అప్పులపాలు చేశారని ఆరోపించిన కూటమి నేతలు ఇప్పుడు ఇంకా ఎక్కువ రుణాలు తెస్తున్నారని మండిపడ్డారు. అమరావతి కోసమే ₹62వేల కోట్లు తెచ్చారని, ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన 2 రోజులకే ₹5వేల కోట్లు అప్పు చేశారని విమర్శించారు. వక్ఫ్ బిల్లుకు మద్దతిచ్చి BJP, TDP, JSP, YCP ముస్లింలను మోసం చేశాయని ఫైరయ్యారు.
Similar News
News April 7, 2025
ఒలింపిక్ మెడలిస్ట్ మేరీ కోమ్ విడాకులు?

ఒలింపిక్ మెడలిస్ట్, బాక్సింగ్ ఐకాన్ మేరీకోమ్ వ్యక్తిగత జీవితంలో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. భర్త కరంగ్ ఓంఖోలర్(ఓంలర్)తో ఆమె విడాకులకు సిద్ధమైనట్లు వార్తలొస్తున్నాయి. మరో బాక్సర్ భర్తతో ఆమె ప్రేమలో పడ్డారని, ప్రస్తుతం ఆయన తన బిజినెస్ పార్ట్నర్గా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనతో కలసి దిగిన ఫొటోలు ఇన్స్టాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇవన్నీ పుకార్లేనని కొందరు కొట్టిపడేస్తున్నారు.
News April 7, 2025
భార్య వల్ల పదవి పోగొట్టుకున్న అధ్యక్షుడు

భార్య తీసుకున్న బహుమతి ఏకంగా అధ్యక్షుడి పదవికే ఎసరు తెచ్చింది. S.కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్పై పార్లమెంటు అభిశంసనను కోర్టు సమర్థించడంతో అక్కడ 2 నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. కొద్ది రోజుల క్రితం ఒక పాస్టర్ నుంచి ఆమె ఓ లగ్జరీ బ్యాగ్ బహుమతిగా అందుకున్నారు. దీనిపై అక్కడి ప్రతిపక్షాలు యూన్ సుక్పై తీవ్ర విమర్శలు గుప్పించాయి. ఆ తర్వాత అక్కడ మార్షల్ లా ప్రకటించారు.
News April 7, 2025
ఏపీ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరం

ఏపీ ప్రభుత్వం చేపట్టనున్న గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు గురించి గోదావరి నదీ యాజమాన్య బోర్డు వద్ద తెలంగాణ ప్రభుత్వం ప్రస్తావించింది. ఏపీ ప్రభుత్వం సమాచారం, DPR వివరాలు దాచిపెడుతోందని ఆరోపించింది. కేంద్రం నుంచి లేఖలు వచ్చినా తమకు బోర్డు కనీస సమాచారం ఇవ్వలేదని పేర్కొంది. అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కడుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏపీ అధికారులు మాత్రం DPR తయారు చేయలేదని చెప్పుకొచ్చారు.