News March 18, 2024
కూటమి నేతలకు ప్రజా సమస్యలపై అవగాహన లేదు: ఎంపీ VSR

AP: చిలకలూరిపేటలో TDP-JSP-BJP మీటింగ్ విఫలమైందని, ప్రజల అంచనాలను అందుకోలేకపోయిందని ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ‘గతంలో ఇచ్చిన హామీల పరిష్కారంపై మాట్లాడలేదు. కొత్త హామీల ఊసెత్తలేదు. రాష్ట్రానికి సంబంధించిన ఏ విజన్ గురించి ప్రస్తావించలేదు. వారికి ప్రజల సమస్యలపై అవగాహన లేదు. కేవలం ప్రభుత్వ వ్యతిరేక ప్రచారమే లక్ష్యంగా పెట్టుకున్నారు’ అని Xలో మండిపడ్డారు.
Similar News
News November 28, 2025
SCలకు ప్రమోషన్లలో వర్గీకరణ అమలుకు జీవో

AP: SC ఉద్యోగులకు ప్రమోషన్లలో వర్గీకరణ అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఉపకులాలకూ న్యాయం చేయడానికి 3గ్రూపులుగా విభజించిన విషయం తెలిసిందే. దీని ప్రకారం గ్రూప్-1 కింద రెల్లి కులాలకు 1%, గ్రూప్-2లో మాదిగ ఉపకులాలకు 6.5%, గ్రూప్-3లో మాల ఉపకులాలకు 7.5% రిజర్వేషన్ వర్తింపజేయనుంది. కేడర్ స్ట్రెంత్ 5 కంటే ఎక్కవ ఉన్నచోట ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది. ప్రతి గ్రూపులో మహిళలకు 33.33% సమాంతర రిజర్వేషన్ ఉంటుంది.
News November 28, 2025
2045 నాటికి 100% ఎలక్ట్రిక్ బస్సులు!

TG: రాష్ట్రంలో 2045 నాటికి 100% ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు RTC ప్రభుత్వానికి తెలిపింది. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్ తయారీ సందర్భంగా ఈ మేరకు వివరించింది. 2035 నాటికి 30% ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతామంది. వరంగల్, ఖమ్మం తదితర జిల్లా కేంద్రాల్లోని బస్టాండ్లతో పాటు హైవేలపై ఉన్న డిపోలను ఎలక్ట్రిక్ ఛార్జింగ్ సెంటర్లుగా మార్చే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించింది.
News November 28, 2025
నేడు క్యాబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలకు ఛాన్స్

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం మంత్రివర్గ సమావేశం జరగనుంది. విశాఖలో రిలయన్స్ డేటా సెంటర్, SIPBలో ఆమోదం పొందిన పలు ప్రాజెక్టులపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అలాగే విశాఖ పెట్టుబడుల సదస్సులో కుదిరిన ఒప్పందాలపైనా సమగ్రంగా చర్చిస్తారని తెలుస్తోంది. స్థానిక ఎన్నికల సన్నద్ధతమైనా చర్చించే అవకాశం ఉంది.


