News September 28, 2024
కూటమి నేతలు పాపపరిహారం చేసుకోవాలి: సజ్జల

AP: తిరుమల లడ్డూ వ్యవహారంలో ఘోరమైన ఆరోపణలు చేసిన కూటమి నేతలు పాపపరిహారం చేసుకోవాలని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. డిక్లరేషన్ అనేది టీటీడీ, భక్తుడికి సంబంధించిన అంశమని చెప్పారు. ‘జగన్ తిరుమల వెళ్తానంటే దానిని రాజకీయం చేశారు. ఎప్పుడూ లేని డిక్లరేషన్ ఇప్పుడు ఎందుకు? గతంలో జగన్ పలుమార్లు తిరుమల వెళ్లినా అడగలేదు. మతం వ్యక్తిగతం అని సీఎం చంద్రబాబుకు తెలియదా?’ అని ఆయన ఫైర్ అయ్యారు.
Similar News
News November 18, 2025
BELలో 52 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<
News November 18, 2025
BELలో 52 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<
News November 18, 2025
10 రోజులు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ

తిరుమలలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని TTD తెలిపింది. నవంబర్ 27-డిసెంబర్ 1 వరకు ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకోవాలని, వీరికి మాత్రమే మొదటి 3 రోజులు దర్శనానికి అనుమతిస్తారని పేర్కొంది. తర్వాత 7రోజులు సర్వదర్శనం(ఉచితం) ఉంటుందని వెల్లడించింది. పది రోజుల్లో 182 గంటలు దర్శన సమయం ఉంటుందని, అందులో 164 గంటలు సామాన్య భక్తులకు అనుమతిస్తామని పేర్కొంది.


