News June 4, 2024
భారీ విజయం దిశగా కూటమి MP అభ్యర్థులు

కూటమి పార్లమెంట్ అభ్యర్థులు ఉత్తరాంధ్రలో భారీ విజయం దిశగా దూసుకెళ్తున్నారు. శ్రీకాకుళం TDP MP అభ్యర్థి రామ్మోహన్ నాయుడు 3,14,107, VZM TDP అభ్యర్థి అప్పలనాయుడు 2,41,740.. విశాఖ TDP అభ్యర్థి భరత్ 4,73,013.. అనకాపల్లి BJP MP అభ్యర్థి C.M.రమేష్ 2,85,529 ఓట్ల మెజార్టీలో కొనసాగుతున్నారు. అరకులో YCP అభ్యర్థి తనూజా రాణి 54,264 ఓట్ల మెజార్టీలో ఉన్నారు. మొత్తం 5 MP స్థానాలకు నాలుగింటిలో కూటమి సత్తా చాటింది.
Similar News
News October 18, 2025
‘వృక్షరాణి’ తులసి తిమ్మక్క గురించి తెలుసా?

మనకెంతో ఇచ్చిన ప్రకృతిని కాపాడేందుకు ఒక్క మొక్కనైనా నాటలేకపోతున్నాం. కానీ కర్ణాటకకు చెందిన 113ఏళ్ల తులసి తిమ్మక్క తన జీవితాన్నే మొక్కలు నాటేందుకు త్యాగం చేశారంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. గత 80 ఏళ్లలో ఈ ‘వృక్షరాణి’ 8,000 కంటే ఎక్కువ మొక్కలు నాటి బీడు భూములను పచ్చగా మార్చారు. పిల్లలు లేని లోటును తీర్చుకునేందుకు ఆమె చెట్లను దత్తత తీసుకున్నారు. ఆమెను కేంద్రం 2019లో పద్మశ్రీతో సత్కరించింది.
News October 18, 2025
అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు మరో అవకాశం

AP: అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు మరో అవకాశమివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు యాక్ట్ను సవరిస్తూ <
News October 18, 2025
ఇతిహాసాలు క్విజ్ – 39 సమాధానాలు

1. క్షీరసాగర మథనం సమయంలో అమృతంతో ఉద్భవించిన దేవతల వైద్యుడు ధన్వంతరి.
2. జమదగ్ని మహర్షి కుమారుడిగా పుట్టిన విష్ణు అవతారం ‘పరుశరాముడు’.
3. కాలానికి, వినాశనానికి దేవతగా కాళీ మాతను పరిగణిస్తారు.
4. క్షీరసాగర సమయంలో మొదట కాలకూట విషం వచ్చింది.
5. ఇంద్రుడి రాజధాని ‘అమరావతి’. <<-se>>#Ithihasaluquiz<<>>