News June 4, 2024
భారీ విజయం దిశగా కూటమి MP అభ్యర్థులు

కూటమి పార్లమెంట్ అభ్యర్థులు ఉత్తరాంధ్రలో భారీ విజయం దిశగా దూసుకెళ్తున్నారు. శ్రీకాకుళం TDP MP అభ్యర్థి రామ్మోహన్ నాయుడు 3,14,107, VZM TDP అభ్యర్థి అప్పలనాయుడు 2,41,740.. విశాఖ TDP అభ్యర్థి భరత్ 4,73,013.. అనకాపల్లి BJP MP అభ్యర్థి C.M.రమేష్ 2,85,529 ఓట్ల మెజార్టీలో కొనసాగుతున్నారు. అరకులో YCP అభ్యర్థి తనూజా రాణి 54,264 ఓట్ల మెజార్టీలో ఉన్నారు. మొత్తం 5 MP స్థానాలకు నాలుగింటిలో కూటమి సత్తా చాటింది.
Similar News
News November 18, 2025
మోక్షాన్ని పొందడమే మన ధర్మం

పరమం యో మహత్తేజః పరమం యో మహత్తపః |
పరమం యో మహద్బ్రహ్మ పరమం యః పరాయణమ్ ||
ఏ దేవుడు పరమతేజమో, ఏ దేవుడు గొప్ప తపమో, ఏ దేవుడు మహత్తరమైన పరబ్రహ్మమో, ఏ దేవుడు పరాయణమో అతడొక్కడే సర్వభూతములకు పొందదగిన స్థానము. ఆ పరాయణమ్ ఈ సృష్టిలోని సకల ప్రాణులకూ చేరుకోవాల్సిన శాశ్వతమైన గమ్యం. ఆ నిత్య తత్వాన్ని ఆరాధించి, మోక్షాన్ని పొందడమే మన ధర్మం. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>
News November 18, 2025
2015 గ్రూప్-2 సెలక్షన్ లిస్ట్ రద్దు: హైకోర్టు

TG: 2015లో నిర్వహించిన గ్రూప్-2 పరీక్ష ఫలితాలపై HC కీలక తీర్పు ఇచ్చింది. 2019లో ఇచ్చిన సెలక్షన్ లిస్ట్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. 2015లో గ్రూప్-2 OMR షీట్ ట్యాంపరింగ్కు గురైందంటూ పిటిషన్ దాఖలైంది. హైకోర్టు ఆదేశాలను TGPSC ఉల్లంఘించిందని ఇవాళ తీర్పు సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. OMR షీట్లను రీవాల్యుయేషన్ చేసి 8 వారాల్లో మళ్లీ సెలక్షన్ లిస్ట్ ఇవ్వాలని TGPSCని ఆదేశించింది.
News November 18, 2025
గ్యాంగ్స్టర్ అన్మోల్ బిష్ణోయ్ భారత్కు అప్పగింత

లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు, గ్యాంగ్స్టర్ అన్మోల్ బిష్ణోయ్ను అమెరికా ప్రభుత్వం భారత్కు అప్పగించింది. అధికారులు అతడిని ఇండియాకు తీసుకొస్తున్నారు. మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హత్య, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పుల కేసులో అన్మోల్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. సిద్దిఖీ కొడుకు జీషన్ US కోర్టులో పిటిషన్ వేయడంతో అన్మోల్ను భారత్కు అప్పగించినట్లు తెలుస్తోంది.


