News June 4, 2024
ఉత్తరాంధ్రలో కూటమి సునామీ

ఉత్తరాంధ్రలో NDA కూటమి దూసుకెళ్తోంది. మొత్తం 34 అసెంబ్లీ స్థానాలకుగాను 30 స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కేవలం నాలుగు స్థానాల్లోనే వైసీపీ ఆధిక్యంలో ఉంది. 2019 ఎన్నికల్లో 34 స్థానాలకుగాను 28 స్థానాల్లో విజయం సాధించిన వైసీపీ.. ఈసారి ఘోరంగా వెనుకబడింది. కేవలం పాడేరు, అరకు, సాలూరు, పాలకొండలో మాత్రమే వైసీపీ ఆధిక్యంలో ఉంది. అటు MP స్థానాల్లో అరకులో మాత్రమే YCP ఆధిక్యంలో ఉంది.
Similar News
News December 28, 2025
‘మా డాడీ ఎవరో తెలుసా?’ అని చెప్పొద్దు.. సజ్జనార్ వార్నింగ్

TG: డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వారు పలుకుబడిని ఉపయోగించాలని ప్రయత్నించవద్దని HYD సీపీ సజ్జనార్ హెచ్చరించారు. ‘మా డాడీ ఎవరో తెలుసా?, మా అంకుల్ ఎవరో తెలుసా? అన్న ఎవరో తెలుసా? అని మా అధికారులను అడగొద్దు. మీ ప్రైవసీకి మర్యాద ఇస్తాం. వాహనం పక్కన పెట్టి, డేట్ వచ్చిన రోజు కోర్టులో పరిచయం చేసుకుందాం’ అని తనదైన స్టైల్లో వార్నింగ్ ఇచ్చారు. మద్యం తాగి వాహనం నడిపితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
News December 28, 2025
శీతాకాలంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే

శీతాకాలంలో ఇమ్యునిటీ తగ్గడం వల్ల రోగాల ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఇలా కాకుండా ఉండాలంటే కొన్నిజాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. రోజూ వ్యాయామం, ఉదయం లేచి ఒక గ్లాసు వేడినీరు తాగడం మంచిది. రోజుకు కనీసం 15 నిమిషాలు సూర్యకాంతిలో కూర్చోవాలి. క్యారెట్, బంగాళాదుంప, చిలకడదుంప , పాలకూర, మెంతి కూర, నారింజ, దానిమ్మ, యాపిల్, తృణధాన్యాలు, ఓట్స్, బార్లీ, బాదం, వాల్నట్స్ ఆహారంలో చేర్చుకోవాలి.
News December 28, 2025
ఇల్లాలి నోటి నుంచి రాకూడని మాటలివే..

ఇల్లాలిని ‘గృహలక్ష్మి’గా భావిస్తారు. ఆమె మాట్లాడే మాటలు ఇంటి వాతావరణాన్ని, ఐశ్వర్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఆమె నోటి నుంచి ఎప్పుడూ పీడ, దరిద్రం, శని, పీనుగ, కష్టం వంటి అమంగళకరమైన పదాలు రాకూడదు. వాటిని పదే పదే ఉచ్చరించడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి తగ్గి, లక్ష్మీదేవి కటాక్షం లోపిస్తుందని చెబుతారు. శుభకర మాటల వల్ల ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. సానుకూల పదాలను వాడటం వల్ల ఆ కుటుంబానికి శ్రేయస్సు కలుగుతుంది.


