News December 8, 2024

రాహుల్ నాయ‌క‌త్వంపై మిత్ర‌ప‌క్షాల్లో ఆందోళ‌న‌: బీజేపీ

image

INDIA కూట‌మికి రాహుల్ సారథ్యంపై మిత్ర‌ప‌క్షాల్లో ఆందోళ‌న నెల‌కొంద‌ని BJP ఎద్దేవా చేసింది. కాంగ్రెస్‌పై SP అసంతృప్తిగా ఉంద‌ని, ఇదే భావనలో ఉన్న‌ మ‌మ‌తా బెన‌ర్జీ కూట‌మిని న‌డిపించ‌డానికి సిద్ధంగా ఉన్నట్టు ప్ర‌క‌టించార‌ని BJP ప్ర‌తినిధి న‌ళిన్ కోహ్లీ అన్నారు. దీనికి శ‌ర‌ద్ ప‌వార్ కూడా మ‌ద్ద‌తు ప‌ల‌కడం రాహుల్ నాయ‌క‌త్వంపై వారిలో నెల‌కొన్న ఆందోళన‌ల‌కు నిదర్శనమన్నారు. ఇందులో బీజేపీ ప్రమేయం లేదన్నారు.

Similar News

News October 22, 2025

పరమ శివుడికి ఇష్టమైన మాసం

image

కార్తీక మాసం మొదలైంది. ఈ నెల రోజులు పరమశివుడికి అత్యంత ప్రీతి పాత్రమైనవి. ఈ మాసంలో తెల్లవారుజామున నదీ స్నానాలు చేసి దేవాలయాలను దర్శించుకోవాలని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో తులసి కోట, దేవాలయాలు, ఉసిరి చెట్టు కింద దీపం వెలిగిస్తే మంచిదని అంటున్నారు. కార్తీక మాస వ్రతం ఆచరించాలని సూచిస్తున్నారు. అంతే కాకుండా అన్నదానం, వస్త్ర దానం, గోదానం చేస్తే పుణ్యం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.

News October 22, 2025

కార్తీక మాసంలో దీపాల విశిష్ఠత

image

కార్తీక మాసంలో సూర్యుడు తుల-వృశ్చిక రాశుల్లో, చంద్రుడు కృత్తికా నక్షత్రంలో సంచరిస్తాడు. దీంతో సూర్యకాంతి తగ్గుతుంది. సూర్యాస్తమయం తర్వగా అవుతూ చీకటి దట్టంగా ఉంటుంది. అప్పుడు మన శరీరమూ కాస్త బద్దకిస్తుంది. చీకట్లను పారదోలడంతోపాటు మన శక్తి పుంజుకునేందుకు దీపాలను వెలిగించాలని పండితులు చెబుతున్నారు. ఉదయం నెయ్యితో, సాయంత్రం నువ్వుల నూనెతో వెలిగించడం శుభప్రదమంటున్నారు.

News October 22, 2025

నేడు యూఏఈకి సీఎం చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు నేటి నుంచి 3 రోజుల పాటు యూఏఈలో పర్యటించనున్నారు. ఇవాళ 10amకు హైదరాబాద్ నుంచి దుబాయ్ బయలుదేరుతారు. వచ్చే నెల 14-15 తేదీల్లో విశాఖలో జరిగే సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌కు వివిధ సంస్థల ప్రతినిధులను ఆహ్వానించనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా మూడు రోజుల్లో రోడ్ షోతో పాటు పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ ప్రతినిధులతో భేటీ కానున్నారు.