News December 8, 2024
రాహుల్ నాయకత్వంపై మిత్రపక్షాల్లో ఆందోళన: బీజేపీ

INDIA కూటమికి రాహుల్ సారథ్యంపై మిత్రపక్షాల్లో ఆందోళన నెలకొందని BJP ఎద్దేవా చేసింది. కాంగ్రెస్పై SP అసంతృప్తిగా ఉందని, ఇదే భావనలో ఉన్న మమతా బెనర్జీ కూటమిని నడిపించడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారని BJP ప్రతినిధి నళిన్ కోహ్లీ అన్నారు. దీనికి శరద్ పవార్ కూడా మద్దతు పలకడం రాహుల్ నాయకత్వంపై వారిలో నెలకొన్న ఆందోళనలకు నిదర్శనమన్నారు. ఇందులో బీజేపీ ప్రమేయం లేదన్నారు.
Similar News
News December 13, 2025
భార్యాభర్తల్లో బీపీ ప్రభావం ఎలా ఉంటుందంటే?

దంపతుల్లో ఏ ఒక్కరికి అధిక రక్త పోటు ఉన్నా రెండో వ్యక్తికి అది వచ్చే అవకాశముందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. హైబీపీ ఉన్న వారిని వివాహం చేసుకున్న మహిళలు ఈ వ్యాధి బారినపడటానికి 19శాతం ఎక్కువ అవకాశం ఉన్నట్లు మిచిగాన్, ఎమోరీ, కొలంబియా విశ్వవిద్యాలయాల అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. చైనా, భారత్ దేశాల్లో ఈ పరిస్థితి బలంగా, ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనంలో కనుగొన్నారు.
News December 13, 2025
ప్రసార భారతిలో కాస్ట్ ట్రైనీ పోస్టులు

<
News December 13, 2025
₹21000 CRతో యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణం: పొంగులేటి

TG: కుల, మతాలకు అతీతంగా విద్యార్థులందరికీ ఉత్తమ విద్య అందించేలా యంగ్ ఇండియా స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ‘CM విద్యకు ప్రాధాన్యమిస్తున్నారు. ₹21వేల కోట్లతో ఈ స్కూళ్ల భవనాలు నిర్మిస్తున్నాం. అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా ₹642 కోట్లతో స్కూళ్లలో సదుపాయాలు కల్పిస్తున్నాం’ అని వివరించారు. నైపుణ్యాల పెంపునకు ITIలలో ATCలను నెలకొల్పుతున్నట్లు వివరించారు.


