News March 4, 2025
శ్రీవారి ఆలయాలకు ఫ్రీగా స్థలం కేటాయించండి: TTD ఛైర్మన్

AP: దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయం నిర్మాణానికి ఉచితంగా స్థలం కేటాయించాలని TTD ఛైర్మన్ BR నాయుడు కోరారు. CM చంద్రబాబు ఆదేశాలతో ఈ మేరకు పలు రాష్ట్రాల CMలకు లేఖలు రాశారు. దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాదని, సమాజ అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో టెంపుల్ టూరిజం ముఖ్యమన్నారు. మన సంస్కృతి, వారసత్వ పరిరక్షణకు ఆలయాలది కీలక పాత్ర అని చెప్పారు.
Similar News
News March 5, 2025
మార్చి 5: చరిత్రలో ఈరోజు

1901: సినీ నటుడు ఈలపాట రఘురామయ్య జననం
1917: సినీ నటి కాంచనమాల జననం
1953: రష్యా మాజీ అధ్యక్షుడు స్టాలిన్ మరణం
1958: సినీ నటుడు నాజర్ జననం
1984: సినీ నటి ఆర్తీ అగర్వాల్ జననం
1985: నటి వరలక్ష్మి శరత్ కుమార్ జననం
1996: హీరోయిన్ మీనాక్షి చౌదరి జననం
2004: సినీ నటుడు కొంగర జగ్గయ్య మరణం
News March 5, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News March 5, 2025
రికార్డ్స్ కంటే జట్టు గెలుపే ముఖ్యం: కోహ్లీ

తనకు వ్యక్తిగత రికార్డుల కంటే కూడా జట్టు గెలుపే ముఖ్యమని టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అన్నారు. ఆసీస్తో మ్యాచ్ అనంతరం ఆయన మాట్లాడారు. ‘ఈ మ్యాచులో నేను సెంచరీ చేసుంటే బాగుండేది. కానీ జట్టు గెలుపు అంత కన్నా ముఖ్యం. మైలురాళ్ల గురించి పట్టించుకోకుంటేనే అవి దక్కుతాయి. సెంచరీ మిస్సైందనే బాధ ఏమాత్రం లేదు. ఈ ఇన్నింగ్స్లో నేను తీసిన సింగిల్స్ సంతోషాన్ని ఇచ్చాయి’ అని ఆయన పేర్కొన్నారు.