News July 30, 2024
రెండు రాష్ట్రాలకే నిధుల కేటాయింపు అవాస్తవం: నిర్మల

కేంద్రం తాజా బడ్జెట్లో బిహార్, APలకే అధిక నిధులు కేటాయించిందనే ఆరోపణల్లో వాస్తవం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. లోక్సభలో బడ్జెట్పై చర్చ సందర్భంగా ఆమె మాట్లాడారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం 2009-10 బడ్జెట్లో 26 రాష్ట్రాలను ప్రస్తావించలేదన్నారు. 2010-11లో 19 రాష్ట్రాలు, 2011-12లో 15, 2012-13లో 16, 2013-14లో 10 రాష్ట్రాలను విస్మరించడంపై ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు.
Similar News
News December 22, 2025
రాష్ట్రంలో 66 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

<
News December 22, 2025
కేసీఆర్ హయాంలో ఎంవోయూలు గ్రౌండ్ కాలేదేమో: కందుల

APలో పెట్టుబడుల MOUలపై కేసీఆర్ చేసిన <<18634035>>విమర్శలకు<<>> మంత్రి కందుల దుర్గేశ్ కౌంటరిచ్చారు. ఆయన హయాంలో MOUలు గ్రౌండ్ కాలేదేమో కానీ ఏపీలో ఆ పరిస్థితి లేదని చురకలంటించారు. ఆయన ఏదో విమర్శించాలని మాట్లాడుతున్నారు తప్ప విషయం లేదన్నారు. రూ.లక్షల కోట్లకు MOUలు జరిగితే రూ.10వేల కోట్లయినా రావాలిగా అని KCR వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
News December 22, 2025
ALERT: పిల్లల ఆధార్ను అప్డేట్ చేశారా?

పిల్లల ఆధార్ కార్డుల్లో బయోమెట్రిక్ అప్డేట్ చేయడం తప్పనిసరి అని UIDAI పేర్కొంది. 5- 15 ఏళ్లు నిండిన పిల్లలకు స్కూల్ అడ్మిషన్లు, ఎగ్జామ్స్, ప్రభుత్వ పథకాల్లో ఇబ్బందులు రావొద్దంటే ఫింగర్ప్రింట్స్, ఫొటో అప్డేట్ చేయాలని సూచించింది. తల్లిదండ్రులు సమీపంలోని ఆధార్ కేంద్రాన్ని సందర్శించి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని X ద్వారా వెల్లడించింది. వచ్చే ఏడాది సెప్టెంబర్ 30వరకూ ఈ సేవలను ఉచితంగా పొందవచ్చు.


