News July 30, 2024
రెండు రాష్ట్రాలకే నిధుల కేటాయింపు అవాస్తవం: నిర్మల

కేంద్రం తాజా బడ్జెట్లో బిహార్, APలకే అధిక నిధులు కేటాయించిందనే ఆరోపణల్లో వాస్తవం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. లోక్సభలో బడ్జెట్పై చర్చ సందర్భంగా ఆమె మాట్లాడారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం 2009-10 బడ్జెట్లో 26 రాష్ట్రాలను ప్రస్తావించలేదన్నారు. 2010-11లో 19 రాష్ట్రాలు, 2011-12లో 15, 2012-13లో 16, 2013-14లో 10 రాష్ట్రాలను విస్మరించడంపై ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు.
Similar News
News December 18, 2025
సినిమాను తలపించేలా.. పెళ్లి వేదికపైనే

నాగ చైతన్య, తమన్నా నటించిన 100% లవ్ మూవీ గుర్తుందా? ఆ సినిమా ప్రీ-క్లైమాక్స్ సీన్లో హీరో కంపెనీకి ఒక సమస్య వస్తే ఓవైపు పెళ్లి పనులు జరుగుతుండగానే దానిని సాల్వ్ చేస్తుంది తమన్నా. దీనిని తలపించే సంఘటన రియల్ లైఫ్లో జరిగింది. కోయల్AI CEO సోదరి పెళ్లైన 10 నిమిషాల్లోనే తమ కంపెనీలో ఏర్పడిన బగ్ను పరిష్కరించడం SMలో వైరల్గా మారింది. కొందరు ఆమె డెడికేషన్ను ప్రశంసిస్తుండగా మరికొందరు విమర్శిస్తున్నారు.
News December 18, 2025
సాయంత్రం 5 గంటలకు ఎన్నికల కోడ్ ఎత్తివేత

TG: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఎన్నికల కోడ్ ఎత్తివేయనున్నట్లు పేర్కొంది. ఎన్నికల విధుల్లో మరణించిన అధికారుల కుటుంబాలకు పరిహారం చెల్లిస్తామని పేర్కొంది. బాధిత కుటుంబాలకు పరిహారం అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ నెల 11, 14, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు జరగగా NOV 25 నుంచి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది.
News December 18, 2025
2,93,587 పంపు సెట్లకు పగటి వేళే విద్యుత్: CS

AP: గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు పూర్తయితే డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గేందుకు వీలుకలుగుతుందని CS విజయానంద్ అభిప్రాయపడ్డారు. PM-KUSUM స్కీమ్ కింద వ్యవసాయ ఫీడర్ల సోలరైజేషన్ ద్వారా 2,93,587 అగ్రి పంపులకు పగలే 9 గంటలు విద్యుత్ అందించేలా పనులు కేటాయించామన్నారు. ‘స్కీమ్లో చేపట్టిన ప్రాజెక్టులతో 3 ఏళ్లలో ₹2,368 కోట్ల మేర పొదుపు అవుతుంది. తద్వారా టారిఫ్లూ తగ్గుతాయి’ అని కలెక్టర్ల సదస్సులో పేర్కొన్నారు.


