News July 30, 2024
రెండు రాష్ట్రాలకే నిధుల కేటాయింపు అవాస్తవం: నిర్మల

కేంద్రం తాజా బడ్జెట్లో బిహార్, APలకే అధిక నిధులు కేటాయించిందనే ఆరోపణల్లో వాస్తవం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. లోక్సభలో బడ్జెట్పై చర్చ సందర్భంగా ఆమె మాట్లాడారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం 2009-10 బడ్జెట్లో 26 రాష్ట్రాలను ప్రస్తావించలేదన్నారు. 2010-11లో 19 రాష్ట్రాలు, 2011-12లో 15, 2012-13లో 16, 2013-14లో 10 రాష్ట్రాలను విస్మరించడంపై ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు.
Similar News
News December 10, 2025
ప్రేమ పేరుతో మోసం చేసిందని మహిళా డీఎస్పీపై ఫిర్యాదు

రాయ్పూర్ డీఎస్పీ కల్పన వర్మ తనను మోసం చేశారని ఆరోపిస్తూ బిజినెస్మ్యాన్ దీపక్ టాండన్ కేసు పెట్టారు. 2021లో ప్రేమ పేరుతో రిలేషన్షిప్లోకి దింపి, బ్లాక్మెయిల్ చేసి తన నుంచి రూ.2 కోట్ల డబ్బు, డైమండ్ రింగ్, కారు, గోల్డ్ చైన్, లగ్జరీ గిఫ్ట్స్, తన హోటల్ ఓనర్షిప్ రాయించుకున్నట్టు ఆరోపించారు. క్రిమినల్ కేసులు పెడతానని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ఈ ఆరోపణలను కల్పన వర్మ ఖండించారు.
News December 10, 2025
ఇండిగో ఎఫెక్ట్.. ఢిల్లీ ఎకానమీకి రూ.1000 కోట్ల నష్టం

ఇండిగో సంక్షోభంతో ఢిల్లీలోని పలు వ్యాపార రంగాలు రూ.1000 కోట్లు నష్టపోయాయని ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ తెలిపింది. ట్రేడర్స్, టూరిస్ట్స్, బిజినెస్ ట్రావెలర్స్ తగ్గారని CTI ఛైర్మన్ బ్రిజేశ్ గోయల్ చెప్పారు. వారం రోజుల్లో ఢిల్లీలోని హోటల్స్, రెస్టారెంట్స్, రిసార్టుల్లో చాలా బుకింగ్స్ రద్దయ్యాయన్నారు. ఆటో మొబైల్స్, హోమ్ నీడ్స్, చేనేత వస్త్రాల ప్రదర్శనలకు సందర్శకులు కరవయ్యారని తెలిపారు.
News December 10, 2025
డ్రై స్కిన్ కోసం ఈ ఫేస్ ప్యాక్

డ్రై స్కిన్ ఉన్న వాళ్లకి చర్మంలో తేమ తగ్గి ముడతలు త్వరగా వచ్చేస్తాయి. ఇలా కాకుండా ఉండాలంటే టేబుల్స్పూన్ కీరదోస గుజ్జులో, టీస్పూన్ ఆలివ్ నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసుకొని ఇరవై నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. ఆపై సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల కీరదోసలోని నీరు ముఖ చర్మంలోకి ఇంకిపోయి పొడిదనం క్రమంగా తగ్గుతుంది. చర్మం నవయవ్వనంగా కనిపిస్తుంది.


