News August 4, 2024

మూసీ ప్రక్షాళనకు రూ.3,849 కోట్లు కేటాయింపు

image

TG: మూసీ నది ప్రక్షాళనపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. నదిని శుద్ధి చేసేందుకు కొత్తగా 39 ఎన్టీపీల నిర్మాణానికై జలమండలికి అనుమతులిచ్చింది. అంతేకాకుండా రూ.3,849.10 కోట్లు కేటాయిస్తూ పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.1,500 కోట్లు కేటాయించగా తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించనున్నట్లు ప్రకటించింది.

Similar News

News March 28, 2026

కోచింగ్ సెంటర్లకు కొత్త రూల్స్.. రోజుకు 5 గంటలే

image

AP: కోచింగ్ సెంటర్ల నిర్వహణకు ఉన్నత విద్యాశాఖ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ప్రతి సంస్థ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఆదివారం సెలవు ఇవ్వాలి. రోజుకు 5 గంటలే నడపాలి. అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఇంటర్నల్‌గా ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేయాలి. ఫీజుల కోసం వేధించొద్దు. భవనం రూల్స్‌కు అనుగుణంగా ఉండాలి. వీటిని ఉల్లంఘిస్తే ₹లక్ష వరకు ఫైన్ ఉంటుంది. అయినా రిపీట్ అయితే రిజిస్ట్రేషన్ రద్దవుతుంది.

News March 28, 2026

వృద్ధ తల్లిదండ్రులకు భరోసా.. నేడు అసెంబ్లీలో బిల్లు

image

TG: ప్రభుత్వ ఉద్యోగుల వృద్ధ తల్లిదండ్రుల రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం నేడు అసెంబ్లీలో ‘TEAMPS’ బిల్లును ప్రవేశపెట్టనుంది. అమ్మానాన్నలను నిర్లక్ష్యం చేసే ఉద్యోగుల శాలరీ నుంచి 15% లేదా ₹10 వేల వరకు కోత విధించి వారికి అందించడమే దీని లక్ష్యం. మంత్రి లక్ష్మణ్‌ దీన్ని సభలో ప్రవేశపెట్టనున్నారు. దీంతో పాటు మంత్రి సీతక్క ‘పంచాయతీరాజ్ బిల్లు-2026’, Dy.CM భట్టి 2025-26 సవరణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

News March 28, 2026

గుడికి వెళ్లినప్పుడు నవగ్రహ ప్రదక్షిణ ఎప్పుడు చేయాలి?

image

శివాలయాలు, హనుమాన్ దేవాలయాలకు వెళ్లినప్పుడు ముందుగా ఆ ఆలయంలోని ప్రధాన దైవాన్ని దర్శించుకోవాలి. ఆ తర్వాతే నవగ్రహ ప్రదక్షిణలు చేయాలి. శాస్త్రాల ప్రకారం మూలవిరాట్టును దర్శించి బయటకు వచ్చాక నవగ్రహ మండపం వద్దకు వెళ్లి పద్ధతి ప్రకారం ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు పూర్తయ్యాక మరోసారి ప్రధాన దైవాన్ని దర్శించుకుని, ఆపై ఇంటికి వెళ్లడం వల్ల సంపూర్ణ ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.