News July 6, 2024
హైస్కూల్ ప్లస్లలో బోధనకు SAల కేటాయింపు

AP: రాష్ట్రంలో 210 హైస్కూల్ ప్లస్లలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు ప్రభుత్వం స్కూల్ అసిస్టెంట్ల(SA)ను కేటాయించింది. గత ప్రభుత్వం మండలానికో కో-ఎడ్యుకేషన్, బాలికలకు ప్రత్యేక కాలేజీల ఏర్పాటుకు ఆదేశాలిచ్చింది. కానీ అధ్యాపకులను నియమించలేదు. అయితే ఈ విద్యాసంవత్సరం నుంచి వీటిని ప్రారంభించారు. విద్యాశాఖ కోరిక మేరకు ఆయా బడుల్లో ఉన్న SAలను ప్రభుత్వం సర్దుబాటు చేసింది.
Similar News
News December 4, 2025
APPLY NOW: BEMLలో ఉద్యోగాలు

భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(<
News December 4, 2025
‘హిల్ట్’ లీకేజ్.. ఇద్దరు ఉన్నతాధికారులపై అనుమానం!

TG: <<18457165>>హిల్ట్<<>> పాలసీ లీకేజీపై విజిలెన్స్ టీమ్ విచారణ వేగవంతం చేసింది. ఈ లీక్ వెనుక ఇద్దరు ఉన్నతాధికారులు ఉన్నారని అనుమానిస్తోంది. సీఎంఓలోని ఓ అధికారిని నిన్న రాత్రి టీమ్ విచారించినట్లు తెలుస్తోంది. అటు BRSతో పాటు ఓ కీలక బీజేపీ నేతకు కూడా సమాచారం లీక్ అయినట్లు టాక్. ఉన్నతాధికారుల ప్రమేయంపై క్లారిటీ రావాల్సి ఉంది. CM ఈ విషయమై సీరియస్గా ఉండటంతో క్లారిటీ వస్తే కారకులకు షోకాజ్ నోటీస్ ఇచ్చే అవకాశముంది.
News December 4, 2025
రూపాయి మరింత పతనం

రూపాయి నేలచూపులు ఆగడం లేదు. ఇవాళ మరోసారి రికార్డు కనిష్ఠ స్థాయిని తాకింది. అమెరికన్ డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 90.43కి పడిపోయింది. నిన్న 90.19 వద్ద ముగిసింది. భారత ఈక్విటీ, డెట్ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకుంటుండటంతో డాలర్ విలువ పెరిగి రూపాయి కిందికి పడుతోంది. ఏడాదిలో 85 నుంచి 90కి పడిపోయిందని, ఇది అత్యంత వేగవంతమైన క్షీణత అని ఎస్బీఐ తెలిపింది.


