News July 1, 2024

పాలిటెక్నిక్ కాలేజీల్లో మొదటి విడత సీట్ల కేటాయింపు

image

TG: పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి 2024-25 విద్యాసంవత్సరానికి గానూ మొదటి విడత సీట్లను కేటాయించారు. ప్రభుత్వ కళాశాలల్లో 11,583, ప్రైవేటు కాలేజీల్లో 9,307 సీట్లను భర్తీ చేసినట్లు అధికారులు తెలిపారు. మరో 8,041 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ప్రవేశం పొందిన విద్యార్థులు ఈ నెల 13 నుంచి 16 మధ్య సంబంధిత కళాశాలల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. జులై 18 నుంచి క్లాసులు ప్రారంభం కానున్నాయి.

Similar News

News November 21, 2025

యూనస్ టచ్ కూడా చేయలేడు: షేక్ హసీనా కొడుకు

image

బంగ్లాదేశ్‌లో రాజ్యాంగవిరుద్ధమైన పరిస్థితులు నెలకొన్నాయని బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా కొడుకు సజీబ్ వాజెద్ అన్నారు. ‘యూనస్ నా తల్లిని చంపలేరు. కనీసం టచ్ కూడా చేయలేరు. బంగ్లాలో చట్టబద్ధమైన పాలన వచ్చిన తర్వాత అంతా మారిపోతుంది’ అని చెప్పారు. 140 రోజుల్లోనే విచారణ పూర్తి చేశారని, న్యాయ ప్రక్రియను పూర్తిగా అపహాస్యం చేశారని మండిపడ్డారు. హసీనాకు <<18311087>>మరణశిక్ష <<>>విధిస్తూ ICT తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.

News November 21, 2025

లీజుకు బంగారం.. ఇప్పుడిదే ట్రెండ్-1

image

అంతర్జాతీయ ఉద్రిక్తతలు, పండుగల సీజన్ నేపథ్యంలో ఇటీవల బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలో బడా ఇన్వెస్టర్లు కొత్త ట్రెండ్‌కు తెరతీశారు. తమ వద్ద ఉన్న బంగారాన్ని అద్దె/లీజుకు ఇస్తున్నారు. బంగారు బిస్కెట్లు, కడ్డీలు వంటి వాటిని ఆభరణాల వ్యాపారులు, రిఫైనర్లు, తయారీదారులకు ఇచ్చి అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. తద్వారా బంగారంపై 2-7% ఆదాయం పొందుతున్నారు. ఇటు ధరల పెరుగుదల, అటు లీజ్ ద్వారా లాభపడుతున్నారు.

News November 21, 2025

లీజుకు బంగారం.. ఇప్పుడిదే ట్రెండ్-2

image

పెట్టుబడిదారులు తొలుత బంగారాన్ని లీజింగ్ ప్లాట్‌ఫామ్ లేదా ఆర్థిక సంస్థకు ఇస్తారు. ఆ సంస్థ నుంచి గోల్డ్‌ను జువెలర్లు తీసుకుని ఆభరణాలు తయారు చేసి అమ్ముకుంటారు. ఇన్వెస్టర్లకు లీజ్ రేట్ ప్రకారం డబ్బు చెల్లిస్తారు. గడువు పూర్తయ్యాక బంగారాన్ని ఇన్వెస్టర్లకు తిరిగి ఇస్తారు. లేదా లీజ్ రెన్యూవల్ చేసుకుంటారు. అయితే జువెలర్లు దివాళా తీస్తే గోల్డ్ రికవరీ కష్టమవుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.