News April 29, 2024

14 మందికి గాజు గ్లాసు గుర్తు కేటాయింపు!

image

AP: జనసేనకు, కూటమి నేతలకు గ్లాస్ సింబల్ టెన్షన్ పట్టుకుంది. ఇప్పటి వరకు రెబల్స్, ఇండిపెండెంట్లు కలిపి 14 మందికి గాజు గ్లాస్ గుర్తును ఎన్నికల అధికారులు కేటాయించారు. రెబల్స్ సుధాకర్(కావలి),మీసాల గీత(విజయనగరం), సూర్యచంద్ర(జగ్గంపేట), రాప్తాడు, విజయవాడ ఎంపీ స్థానాల్లో నవతరం పార్టీకి, మదనపల్లె, చంద్రగిరి, శ్రీకాళహస్తి, కమలాపురంలో ఇండిపెండెంట్లకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు.

Similar News

News January 19, 2026

రేపు ఆటోల బంద్.. క్లారిటీ

image

TG: రాష్ట్రంలో మంగళవారం ఆటోల బంద్‌ లేదని స్టేట్ టాక్సీ & ఆటో యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పెంటయ్యగౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన రూ.12 వేల ప్రోత్సాహకాన్ని వడ్డీతో సహా చెల్లించాలని డిమాండ్ చేశారు. బైక్ ట్యాక్సీలను రద్దు చేయాలనే డిమాండ్‌తో త్వరలోనే ఉద్యమం చేపడతామన్నారు. ఆటో డ్రైవర్లను మోసం చేసిన కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్తామని హెచ్చరించారు.

News January 19, 2026

సిట్ విచారణకు హాజరవ్వాలని హరీశ్ నిర్ణయం

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో <<18900983>>నోటీసుల<<>> నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్ రావు సిట్ విచారణకు హాజరవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. రేపు ఉదయం 9 గంటలకు ఆయన తెలంగాణ భవన్‌కు చేరుకోనున్నారు. అక్కడ పలువురు బీఆర్ఎస్ కీలక నేతలతో భేటీ అవుతారు. అనంతరం అక్కడి నుంచి జూబ్లీహిల్స్ పీఎస్‌కు బయల్దేరుతారు. ఉదయం 11 గంటలకు విచారణకు హాజరవుతారు.

News January 19, 2026

రెవెన్యూ లోటుతో ఉక్కిరిబిక్కిరి

image

మూడేళ్లుగా APని రెవెన్యూ లోటు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కమిటెడ్ వ్యయం పెరగడం, పన్నేతర ఆదాయం తగ్గడం దీనికి కారణమని కాగ్ నివేదిక పేర్కొంటోంది. FY25-26 NOV నాటికి ₹54355 CR రెవెన్యూ లోటు ఉంది. ఈ లోటు 2024లో ₹56805 CR, 2023లో ₹47063 CRగా ఉంది. దీని భర్తీకి అప్పులు చేయక తప్పడం లేదు. రుణాల్లో 80% శాలరీ, పెన్షన్లు వంటి రెవెన్యూ ఖర్చుకే సరిపోతుండగా క్యాపిటల్ వ్యయం అంతంతే.