News July 10, 2024
BPCLకు అవసరమైన స్థలం కేటాయిస్తాం: CM

APలో పెట్రోల్ రిఫైనరీ ఏర్పాటుపై BPCL ఛైర్మన్ కృష్ణకుమార్, ప్రతినిధులతో CM చంద్రబాబు భేటీ ముగిసింది. రాష్ట్రంలో గణనీయమైన పెట్రోకెమికల్ వనరులున్నాయని ఈ సందర్భంగా CM అన్నారు. రూ.60-70వేల కోట్లతో ఏర్పాటు చేయనున్న కంపెనీకి 5వేల ఎకరాలు అవసరమని సంస్థ ప్రతినిధులు ఆయన దృష్టికి తెచ్చారు. 90 రోజుల్లో ప్రాజెక్టుపై పూర్తి నివేదిక రూపొందించాలని, ఇబ్బందులు లేకుండా అవసరమైన స్థలం కేటాయిస్తామని CM హామీ ఇచ్చారు.
Similar News
News February 10, 2026
IPLకూ హర్షిత్ రాణా డౌటే!

టీమ్ ఇండియా యంగ్ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా మోకాలి గాయం కారణంగా సోమవారం సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం జరుగుతున్న T20 వరల్డ్ కప్ నుంచి మాత్రమే కాకుండా త్వరలో రాబోయే IPL సీజన్ నుంచి కూడా ఆయన దాదాపు తప్పుకున్నట్లేనని తెలుస్తోంది. సౌతాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్లో రాణా గాయపడ్డారు. త్వరలో బెంగళూరులోని BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో రిపోర్టు చేయనున్నారు.
News February 10, 2026
పిల్లల్లో ADHDకి మందులు వాడుతున్నారా?

పిల్లల్లో అటెన్షన్ డెఫిసిట్ హైపరాక్టివ్ డిసీజ్(ADHD) నిర్ధారణ అయిన వెంటనే కొందరు వైద్యులు మందులు సిఫార్సు చేస్తారు. కానీ ఇది సరికాదంటోంది స్టాన్ఫర్డ్ మెడిసిన్ తాజా అధ్యయనం. ఆరేళ్లలోపు పిల్లల్లో మందులను ప్రాసెస్ చేసే మెటబాలిజం పూర్తిగా అభివృద్ధి చెందదు. దాంతో ఈ చికిత్స వల్ల ఎలాంటి ప్రయోజనమూ దక్కదంటున్నారు. మందులకంటే ముందు వాళ్లకు బిహేవియరల్ థెరపీ ఇవ్వాలని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.
News February 10, 2026
విశాఖ మెట్రోకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!

AP: విశాఖ మెట్రోకు కేంద్ర మంత్రి మనోహర్లాల్ ఖట్టర్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్టు సమాచారం. CM చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మెట్రోకి అనుమతి ఇవ్వాలనే CM అభ్యర్థన మేరకు అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. కేంద్ర క్యాబినెట్ ఆమోదం తర్వాత మెట్రోకి సంబంధించిన ఉత్తర్వులు అధికారికంగా వెలువడే అవకాశముంది.


