News August 22, 2024

ఆఫ్‌లైన్ బుకింగ్ ఉంటేనే అనుమతించండి: CBN

image

AP: రేపటి నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో ఇసుక ఆఫ్‌లైన్ బుకింగ్ ప్రక్రియ మొదలవనుంది. సీఎం ఆదేశాలతో ఇసుక రవాణాదారులతో ఇవాళ కలెక్టర్లు సమావేశం కానున్నారు. స్టాక్ పాయింట్లలో ఇసుక ధర, దూరాన్ని బట్టి ఛార్జీలను ప్రకటిస్తారు. ఆఫ్‌లైన్ బుకింగ్ చేసుకున్నవారినే అనుమతించాలని అధికారులను CBN ఆదేశించారు. మరోవైపు వచ్చే నెల 11 నుంచి ఆన్‌లైన్‌లో ఇసుక బుకింగ్ సదుపాయం అందుబాటులోకి తెస్తామని సీఎంకు అధికారులు తెలిపారు.

Similar News

News December 25, 2025

రేవంత్ పేరెత్తని కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా?

image

TG: KCR ఇటీవల రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శల దాడికి దిగుతూ సుదీర్ఘంగా మాట్లాడారు. తన ప్రసంగంలో ఒక్కసారి కూడా సీఎం రేవంత్ పేరు ఎత్తలేదు. అలాంటిది అసెంబ్లీలో CM ఎదుట ప్రతిపక్ష నేతగా కూర్చోవడానికి ఇష్టపడతారా? అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు KCR అసెంబ్లీకి వెళ్లి పాలమూరు-రంగారెడ్డిపై ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టనున్నారనే టాక్ BRS పార్టీలో విన్పిస్తోంది. దీనిపై క్లారిటీ కోసం <<18664624>>29వ తేదీ<<>> వరకు వేచి చూడాల్సిందే.

News December 25, 2025

NCERT 173 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

<>NCERT <<>>173 గ్రూప్ A, B, C పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు DEC 27 నుంచి జనవరి 16 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్ , ITI, డిప్లొమా( ప్రింటింగ్ టెక్నాలజీ, గ్రాఫిక్స్), డిగ్రీ, PG, B.Tech, M.Tech, MBA, M.Lib.Sc, B.Lib.Sc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాతపరీక్ష/CBT, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.ncert.nic.in

News December 25, 2025

తిరుమల క్షేత్రపాలుడిగా పరమశివుడు

image

తిరుమల కేవలం వైష్ణవ క్షేత్రమే కాదు. శైవ సామరస్యానికి వేదిక కూడా! శ్రీవారు ఇక్కడ కొలువై ఉంటే, ఆయనకు రక్షకుడిగా, క్షేత్రపాలుడిగా పరమశివుడు ‘రుద్రుడి’ రూపంలో కొలువై ఉంటారు. తిరుమల కొండపై ఉన్న ‘గోగర్భ తీర్థం’ వద్ద శివుడు క్షేత్రపాలకత్వ బాధ్యతలు నిర్వహిస్తారట. శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు క్షేత్రపాలుడిని కూడా స్మరించుకోవడం ఆచారంగా వస్తోంది. హరిహరుల మధ్య భేదం లేదని ఈ క్షేత్రం చాటిచెబుతోంది.