News August 22, 2024
ఆఫ్లైన్ బుకింగ్ ఉంటేనే అనుమతించండి: CBN

AP: రేపటి నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో ఇసుక ఆఫ్లైన్ బుకింగ్ ప్రక్రియ మొదలవనుంది. సీఎం ఆదేశాలతో ఇసుక రవాణాదారులతో ఇవాళ కలెక్టర్లు సమావేశం కానున్నారు. స్టాక్ పాయింట్లలో ఇసుక ధర, దూరాన్ని బట్టి ఛార్జీలను ప్రకటిస్తారు. ఆఫ్లైన్ బుకింగ్ చేసుకున్నవారినే అనుమతించాలని అధికారులను CBN ఆదేశించారు. మరోవైపు వచ్చే నెల 11 నుంచి ఆన్లైన్లో ఇసుక బుకింగ్ సదుపాయం అందుబాటులోకి తెస్తామని సీఎంకు అధికారులు తెలిపారు.
Similar News
News December 27, 2025
లేజర్ గన్ ద్వారా 17,491 కేసులు నమోదు: KNR సీపీ

ప్రజా స్నేహిత పోలీసింగ్, ఆధునిక సాంకేతికతతో కరీంనగర్ నగరాన్ని మరింత సురక్షితంగా తీర్చిదిద్దుతామని సీపీ గౌష్ ఆలం తెలిపారు. 2025 వార్షిక నేర సమీక్ష సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిబంధనల ఉల్లంఘనపై 3.83 లక్షల ఈ-చలాన్లు, లేజర్ గన్ ద్వారా 17,491 కేసులు నమోదు చేశామన్నారు. పోలీసుల కఠిన చర్యల వల్ల రోడ్డు ప్రమాదాలు స్వల్పంగా తగ్గాయని, నేర నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం అవసరమని ఆయన స్పష్టం చేశారు.
News December 27, 2025
టెక్నాలజీ విషయంలో భువనేశ్వరి నాకంటే ముందున్నారు: చంద్రబాబు

NTR ట్రస్టు, విద్యాసంస్థలను నారా భువనేశ్వరి సమర్థవంతంగా నడిపిస్తున్నారని CM CBN ప్రశంసించారు. HYDలో జరిగిన NTR ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వార్షికోత్సవంలో ఆయన మాట్లాడారు. టెక్నాలజీ విషయంలో భువనేశ్వరి తన కంటే ముందున్నారని, తాను పేపర్ చూసి స్పీచ్ ఇస్తుంటే ఆమె ట్యాబ్ చూసి మాట్లాడుతున్నారని చమత్కరించారు. ఇక చిన్నప్పుడు తనను చాలామంది IAS చదవమన్నా తాను రాజకీయాల్లోకి రావాలని డిసైడ్ అయ్యాయని చెప్పారు.
News December 27, 2025
తప్పు ఒప్పుకున్న శివాజీ

నటుడు <<18646239>>శివాజీ<<>> క్షమాపణలు చెప్పినట్లు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇవాళ విచారణలో ఆయన తన తప్పును అంగీకరించారని, కమిషన్ ఛైర్పర్సన్ శారద అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేకపోయారని పేర్కొంది. ఇక మీదట మహిళల విషయంలో మర్యాద పూర్వకంగా వ్యవహరిస్తానని స్పష్టం చేసినట్లు వెల్లడించింది. మహిళలను సమ దృష్టిలో చూడాలని, ఇతరుల విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేయరాదని శివాజీకి సూచించినట్లు తెలిపింది.


