News July 19, 2024

ముస్లింలను దేశంలో ఉండనివ్వడమే పెద్ద తప్పు: కేంద్రమంత్రి

image

1947లో విభజన తర్వాత ముస్లింలను భారత్‌లో ఉండనివ్వడమే తప్పు అని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మన పూర్వీకులు మత ప్రాతిపదికన దేశాన్ని విభజిస్తే ముస్లింలను ఇక్కడ ఎందుకు ఉండనిచ్చారని ప్రశ్నించారు. అప్పుడే వాళ్లను PAKకు పంపించాల్సిందన్నారు. ‘ముస్లింలను దేశంలో ఉండనివ్వడం మన దౌర్భాగ్యం, లేకపోతే పరిస్థితి వేరేలా ఉండేది’ అని పాంచజన్య వీక్లీ మ్యాగజైన్‌లో ఆయన కథనం రాశారు.

Similar News

News February 24, 2026

ఎండు ద్రాక్షతో ఎన్నో లాభాలు

image

ఎండు ద్రాక్షను నేరుగా తినడం కంటే నీటిలో నానబెట్టి తినడం వల్ల ఎన్నో లాభాలుంటాయంటున్నారు నిపుణులు. ఎండుద్రాక్షలను నానబెట్టినప్పుడు వాటిపై ఉండే పొర మెత్తబడి, లోపల ఉన్న విటమిన్లు, ఖనిజాలు శరీరం సులభంగా గ్రహించేలా మారుతాయంటున్నారు. దీనివల్ల రక్తహీనత తగ్గడం, జీర్ణక్రియ మెరుగవడం, రోగనిరోధక శక్తి, ఎముకల బలం పెరగడంతో పాటు చర్మం, జుట్టు ఆరోగ్యం బావుంటుందని చెబుతున్నారు.

News February 24, 2026

మా డోర్లు తెరిచే ఉంటాయి… సమస్యలు చెప్పండి: పొన్నం

image

TG: ప్రభుత్వంలో RTC విలీనం, ఇతర అంశాలు GOVT పరిశీలనలో ఉన్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ‘ఆర్థిక పరిస్థితి వల్ల సమస్యలు ఒక్కటొక్కటిగా పరిష్కరిస్తున్నాం. మీ కుటుంబ సభ్యుడిగా నా ఆఫీసు డోర్స్ ఎల్లవేళలా తెరిచే ఉంటాయి. ఏ సమస్య అయినా చెప్పవచ్చు. అన్నిటినీ చర్చిద్దాం. ఆందోళనలు, నిరసనలు లేకుండా RTCని కాపాడుకుందాం’ అని వివరించారు. కార్మిక సంక్షేమం, సంస్థ పురోగతికి కలిసి పనిచేద్దామని అన్నారు.

News February 24, 2026

WT20 WC: జూన్ 14న భారత్-పాక్ మ్యాచ్

image

ఇంగ్లండ్ వేదికగా ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ జూన్ 12 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ ఇంగ్లండ్-శ్రీలంక మధ్య జరగనుంది. భారత్ తన ఫస్ట్ మ్యాచ్‌లోనే పాకిస్థాన్‌ను జూన్ 14న ఢీకొట్టనుంది. టీమ్ ఇండియా జూన్ 17న నెదర్లాండ్స్‌తో, 21న సౌతాఫ్రికాతో, 25న బంగ్లాదేశ్‌తో, 28న ఆస్ట్రేలియాతో తలపడనుంది. పూర్తి షెడ్యూల్ పైన ఇమేజ్‌లో చూడవచ్చు.