News July 19, 2024

ముస్లింలను దేశంలో ఉండనివ్వడమే పెద్ద తప్పు: కేంద్రమంత్రి

image

1947లో విభజన తర్వాత ముస్లింలను భారత్‌లో ఉండనివ్వడమే తప్పు అని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మన పూర్వీకులు మత ప్రాతిపదికన దేశాన్ని విభజిస్తే ముస్లింలను ఇక్కడ ఎందుకు ఉండనిచ్చారని ప్రశ్నించారు. అప్పుడే వాళ్లను PAKకు పంపించాల్సిందన్నారు. ‘ముస్లింలను దేశంలో ఉండనివ్వడం మన దౌర్భాగ్యం, లేకపోతే పరిస్థితి వేరేలా ఉండేది’ అని పాంచజన్య వీక్లీ మ్యాగజైన్‌లో ఆయన కథనం రాశారు.

Similar News

News November 18, 2025

ALERT: ఫోన్ IMEI నంబర్ మారుస్తున్నారా?

image

ఫోన్లలోని 15 అంకెల IMEI నంబర్‌ను మార్చడం నాన్ బెయిలబుల్ నేరం కిందికి వస్తుందని టెలికం శాఖ హెచ్చరించింది. మూడేళ్ల జైలు శిక్ష లేదా రూ.50 లక్షల జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉందని స్పష్టం చేసింది. తయారీదారులు, బ్రాండ్ ఓనర్లు, ఇంపోర్టర్లు, సెల్లర్లకు అడ్వైజరీ జారీ చేసింది. నిబంధనలకు లోబడి ఉండాలని సూచించింది. ఐఎంఈఐని మార్చేందుకు ఉపయోగించే పరికరాలను కలిగి ఉండటం కూడా నేరమేనని వార్నింగ్ ఇచ్చింది.

News November 18, 2025

ALERT: ఫోన్ IMEI నంబర్ మారుస్తున్నారా?

image

ఫోన్లలోని 15 అంకెల IMEI నంబర్‌ను మార్చడం నాన్ బెయిలబుల్ నేరం కిందికి వస్తుందని టెలికం శాఖ హెచ్చరించింది. మూడేళ్ల జైలు శిక్ష లేదా రూ.50 లక్షల జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉందని స్పష్టం చేసింది. తయారీదారులు, బ్రాండ్ ఓనర్లు, ఇంపోర్టర్లు, సెల్లర్లకు అడ్వైజరీ జారీ చేసింది. నిబంధనలకు లోబడి ఉండాలని సూచించింది. ఐఎంఈఐని మార్చేందుకు ఉపయోగించే పరికరాలను కలిగి ఉండటం కూడా నేరమేనని వార్నింగ్ ఇచ్చింది.

News November 18, 2025

నేడు ఇలా చేస్తే ఎన్నో శుభాలు కలుగుతాయి

image

కృష్ణాంగారక చతుర్దశి ఎన్నో శుభాలను కలిగించే పవిత్రమైన రోజు. నేడు ఎర్ర పూలు/కుంకుమ కలిపిన నీటితో స్నానం చేస్తే అంగారకుడి కటాక్షం కలుగుతుందట. ఆదిత్య మంత్రం 12 సార్లు పలికితే సూర్యుడు అనుగ్రహిస్తాడని నమ్మకం. పితృ తర్పణంతో రుణ బాధలు తొలగి, సంతోషంగా ఉంటారట. గోధుమలు దానమిస్తే జాతకంలో రవి బలం బాగుంటుందట. యమ దీపం వెలిగిస్తే అప్పుల బాధలు తొలగి, కుజ దోషం పోయి సొంతింటి కల నెరవేరుతుందని పండితులు అంటున్నారు.