News December 14, 2024

అల్లు అర్జున్‌తోపాటు మరో ఇద్దరు విడుదల

image

సంధ్య థియేటర్ తొక్కిసలాట వ్యవహారంలో అల్లు అర్జున్‌తోపాటు మరో ఇద్దరిని బెయిల్‌పై విడుదల చేసినట్లు చంచల్‌గూడ జైలు అధికారులు తెలిపారు. సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని కూడా రిలీజ్ చేసినట్లు వెల్లడించారు. భద్రతా కారణాల రీత్యా వెనుక గేటు నుంచి వారిని బయటకు పంపించినట్లు చెప్పారు. నిన్న రాత్రి 10 గంటల తర్వాత బెయిల్ అందడంతో ఇవాళ ఉదయం 6.45 గంటలకు విడుదల చేసినట్లు పేర్కొన్నారు.

Similar News

News December 12, 2025

185 ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

నైనిటాల్ బ్యాంక్ లిమిటెడ్‌లో 185 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. CSA, PO, CA, రిస్క్ ఆఫీసర్, ఐటీ ఆఫీసర్ తదితర 14 కేటగిరీల్లో ఖాళీలున్నాయి. పోస్టును బట్టి డిగ్రీ, ఎంబీఏ, పీజీ, సీఏ, బీటెక్ పూర్తయిన వారు అర్హులు. దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 1. ఆన్‌లైన్ ఎగ్జామ్ జనవరి 18న జరగనుంది.
వెబ్‌సైట్: https://www.nainitalbank.bank.in/

News December 12, 2025

ఆ పార్టీతో మాకు సంబంధం లేదు: శ్రీను, మాధురి

image

<<18539894>>ఫామ్‌హౌస్ పార్టీకి<<>> తమకు సంబంధం లేదని MLC దువ్వాడ శ్రీను, మాధురి తెలిపారు. ‘మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకరు పిలిస్తే అక్కడికి వెళ్లాం. బిజినెస్ మీట్ పెడుతున్నాం రమ్మని అడిగారు. అక్కడ విదేశీ మద్యం, హుక్కా ఉందని మాకు తెలియదు’ అని శ్రీను మీడియాకు చెప్పారు. ‘నాకు హుక్కా అంటే ఏంటో కూడా తెలియదు. పోలీసులు చెప్పాకే ఆ పార్టీకి పర్మిషన్ లేదని తెలిసింది. నేను అరెస్ట్ కాలేదు. ఇంట్లోనే ఉన్నా’ అని మాధురి వివరించారు.

News December 12, 2025

‘పత్తిలో 18% తేమ ఉన్నా కొనుగోలు చేయాలి’

image

సీసీఐ తేమ నిబంధనలతో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, వాటిని సడలించాలని.. TDP MP లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్రాన్ని కోరారు. లోక్‌సభ జీరో అవర్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ‘పత్తిలో తేమ 8-12% మించకూడదని CCI నిబంధనలున్నాయి. దీన్ని సడలించి 18% తేమ ఉన్నా కొనుగోలు చేయాలి. అలాగే వర్షంలో తడిచినా, రంగుమారిన పత్తిని ప్రత్యేక కేటగిరీ కింద తగిన ధరకు కొనుగోలు చేయాలి’ అని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.