News December 14, 2024
అల్లు అర్జున్@ ఖైదీ నంబర్ 7697

బెయిల్ మంజూరైనా పలు కారణాలతో అల్లుఅర్జున్ చంచల్గూడ జైలు నుంచి విడుదల కాలేదు. దీంతో జైలు అధికారులు ఆయన్ను అండర్ ట్రైల్ ఖైదీగా(ఖైదీ నంబర్ 7697) మంజీరా బ్యారక్లో ఉంచారు. రాత్రి 10 గంటల వరకు జైలు రిసెప్షన్లోనే ఉంచిన సిబ్బంది ఆపై బ్యారక్లోని క్లాస్–1 రూమ్కు తరలించినట్లు తెలుస్తోంది. అందులో ఆయనతో మరో ఇద్దరు విచారణలో ఉన్న ఖైదీలు ఉన్నట్లు సమాచారం. ఈ ఉదయం అల్లుఅర్జున్ విడుదల కానున్నారు.
Similar News
News January 10, 2026
జంగా కృష్ణమూర్తికి CM చంద్రబాబు ఫోన్!

AP: పల్నాడు నేత జంగా కృష్ణమూర్తి నిన్న TTD బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో CM CBN ఆయనకు ఫోన్ చేసి మాట్లాడినట్లు సమాచారం. దీంతో జంగా ఇవాళ లేదా రేపు CMను కలవనున్నట్లు సన్నిహిత వర్గాలు చెప్పాయి. కాగా తిరుమలలో అతిథి గృహం నిర్మించడానికి తనకు స్థలం కేటాయింపు పునరుద్ధరణపై ఓ పత్రికలో కథనాలు వచ్చాయని జంగా పేర్కొన్నారు. దీనిపై మనస్తాపం చెంది రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
News January 10, 2026
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఇవాళ రూ.1,150 పెరిగి రూ.1,40,460కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,050 ఎగబాకి రూ.1,28,750 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.7వేలు పెరిగి రూ.2,75,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.
News January 10, 2026
‘వ్యవసాయ యాంత్రీకరణ’ పథకంలో రాయితీ ఇలా..

ఈ పథకం కింద యంత్రాల కొనుగోలుకు ప్రభుత్వం భారీగా సబ్సిడీ ఇస్తోంది. లబ్ధిదారుల కేటగిరీని బట్టి దీనిలో వాటా ఉంటుంది. సన్న, చిన్నకారు, మహిళా రైతులు, SC, ST, BC రైతులు యంత్రాన్ని కొనుగోలు చేస్తే ధరలో 50% వారు భరించాలి. మిగిలిన 50 శాతాన్ని ప్రభుత్వం రాయితీగా నేరుగా కంపెనీ ఖాతాలో జమ చేస్తుంది. ఇతర రైతులు యంత్రం ధరలో 60 శాతం వాటాను భరించాల్సి ఉండగా.. 40 శాతాన్ని ప్రభుత్వం సబ్సిడీ రూపంలో భరిస్తుంది.


