News July 25, 2024

ఒంటరిగానే అసెంబ్లీ ఎన్నికల బరిలోకి: రాజ్ ఠాక్రే

image

అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(MNS) చీఫ్ రాజ్ ఠాక్రే ప్రకటించారు. మహాయుతి కూటమితో పొత్తులో ఉండబోమని స్పష్టం చేశారు. రోడ్ల గుంతలు పూడ్చడానికి డబ్బులు లేకపోయినా ప్రభుత్వం కొత్త పథకాలను ప్రకటిస్తోందని ఆయన దుయ్యబట్టారు. మహారాష్ట్రలో 225-250 సీట్లలో పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలిపారు.

Similar News

News December 29, 2025

నేటి ముఖ్యాంశాలు

image

* కొత్త ఆశలు, సంకల్పంతో నూతన ఏడాదిలోకి: PM మోదీ
* పేదల హక్కులపై BJP దాడి: ఖర్గే
* రేపు అసెంబ్లీకి హాజరుకానున్న కేసీఆర్
* నీటిపారుదల శాఖపై CM రేవంత్ సమీక్ష.. అసెంబ్లీలో లేవనెత్తే ప్రశ్నలపై వ్యూహం సిద్ధం
* అయోధ్యను దర్శించుకున్న CM CBN.. శ్రీరాముడి విలువలు అందరికీ ఆదర్శమని ట్వీట్
* శ్రీలంక ఉమెన్స్‌తో 4వ టీ20లో భారత్ విజయం
* భారీగా పెరిగిన చికెన్ ధరలు.. కేజీ రూ.300

News December 29, 2025

నెహ్రూ లేఖలను తిరిగి ఇచ్చేయండి: కేంద్రమంత్రి

image

జవహర్‌లాల్ నెహ్రూకు సంబంధించిన కీలక లేఖలు, పత్రాలు దేశ వారసత్వ సంపద అని కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పష్టం చేశారు. వీటిని వెంటనే ‘ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండ్ లైబ్రరీ’కి తిరిగి అప్పగించాలని సోనియా గాంధీని కోరారు. అవి కుటుంబ ఆస్తి కాదని.. దేశ చరిత్రను తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందన్నారు. 2008లో దాదాపు 26,000 పత్రాలను తీసుకెళ్లారని.. గతంలో పలుమార్లు కోరినా తిరిగి ఇవ్వలేదని గుర్తు చేశారు.

News December 29, 2025

‘ఆరావళి’పై రేపు సుప్రీంలో విచారణ

image

<<18663286>>ఆరావళి పర్వతాల<<>> నిర్వచనంపై చెలరేగిన వివాదాన్ని సుప్రీంకోర్టు రేపు విచారించనుంది. CJI జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ అగస్టిన్ జార్జి మాసిహ్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించే అవకాశం ఉంది. ఆరావళి కొండలు, శ్రేణుల నిర్వచనం, అనుబంధ సమస్యల వివాదంపై ముఖ్యంగా విచారణ జరగనుంది. కాగా ఆరావళిలో మైనింగ్‌ <<18662201>>నిలిపివేస్తున్నట్లు<<>> కేంద్రం ఇప్పటికే ప్రకటించింది.