News February 25, 2025

ALP: మహాశివరాత్రికి లడ్డూ ప్రసాదం రెడీ

image

అలంపూర్ లో వెలసిన బాల బ్రహ్మేశ్వర స్వామి, జోగులాంబ దేవి ఆలయాల్లో ఈనెల 26న జరిగే మహాశివరాత్రి వేడుకలకు ఆలయాలు సుందరంగా ముస్తాబు అయ్యాయి. స్వామి అమ్మవారి మహా ప్రసాదంగా భావించే లడ్డు ల కొరత రాకుండా భక్తుల సౌకర్యార్థం 20 వేల లడ్డులు తయారు చేయించినట్లు ఈవో పురందర్ కుమార్ సోమవారం తెలిపారు. శివరాత్రి వేడుకలకు తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి రానున్నారు.

Similar News

News February 25, 2025

స్వయం ఉపాధికి రాయితీ రుణాల మంజూరు

image

AP: క్రైస్తవ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి పథకాలకు రుణ రాయితీ కింద రూ.2.43కోట్లను విడుదల చేసినట్లు మంత్రి NMD ఫరూక్ తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఈ కార్పొరేషన్ ద్వారా రూ.4.86కోట్ల స్వయం ఉపాధి ప్రణాళిక అమలుకు నిర్ణయించామన్నారు. ఇందులో భాగంగానే రూ.2.43కోట్లు రాయితీ కింద ఇస్తుండగా, మిగతా మొత్తాన్ని బ్యాంకుల ద్వారా రుణ రూపంలో పంపిణీ చేయనున్నట్లు మంత్రి వివరించారు.

News February 25, 2025

నెల్లూరు ఐటీడీఏ పీవోగా మల్లికార్జున్ రెడ్డి

image

నెల్లూరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారిగా మల్లికార్జున్ రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా కొండాయపాలెం గేటు వద్ద ఆ శాఖ ప్రధాన కార్యాలయంలో సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కొంతకాలంగా ఆ స్థానం ఖాళీగా ఉండడంతో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి PBN పరిమళ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వహించారు. ఎట్టకేలకు ప్రభుత్వం రెగ్యులర్ POను నియమించడంతో ఆ స్థానం భర్తీ అయ్యింది. ఈ మేరకు మల్లికార్జున్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.

News February 25, 2025

విశాఖ నుంచి షాలిమార్‌కు వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్

image

ప్రయాణికుల రద్దీ తగ్గించేందుకు విశాఖ- షాలిమార్‌కు(08508/07) వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ నడపనున్నట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ తెలిపారు. ఈ రైలు మార్చి 11 నుంచి ఏప్రిల్ 29వరకు ప్రతి మంగళవారం నడవనుంది. మంగళవారం విశాఖలో బయలుదేరి బుధవారం షాలిమార్ చేరుకుంటుంది. మళ్లీ బుధవారం షాలిమార్ నుంచి బయలుదేరి గురువారం విశాఖ చేరుతుంది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

error: Content is protected !!