News October 14, 2024
జంగిల్ క్లియరెన్స్ తర్వాత అమరావతి ఇలా..
AP: అమరావతి నిర్మాణంపై కూటమి సర్కార్ వడివడిగా అడుగులు వేస్తోంది. ముందుగా జంగిల్ క్లియరెన్స్ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టిన ప్రభుత్వం దాదాపు పూర్తి చేసింది. దీంతో ఇప్పటివరకూ ముళ్ల కంపలు, పిచ్చి చెట్లతో చిన్నపాటి అడవిలా దర్శనమిచ్చిన ఆ ప్రాంతమంతా చూడచక్కగా కనిపిస్తోంది. ఇటు ప్రధాన రహదారులు, ఇతర నిర్మాణాలకు టెండర్లను సైతం డిసెంబర్లోపు ఖరారు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
Similar News
News October 14, 2024
అలాంటి నాయకులను నమ్మొద్దు: అశోక్గజపతి రాజు
AP: గత ఐదేళ్లలో ఆలయాలను భ్రష్టు పట్టించారని కేంద్ర మాజీ మంత్రి అశోక్గజపతి రాజు మండిపడ్డారు. APలోని అన్ని ఆలయాల్లో ప్రసాదం కల్తీ చేశారని ఆరోపించారు. రామతీర్థ విగ్రహాన్ని ధ్వంసం చేసి విధ్వంస పాలన చేశారని దుయ్యబట్టారు. నాడు విగ్రహం కోసం నిధులు సేకరించి పంపిస్తే వెనక్కి పంపారన్నారు. ఇంట్లో ఒక మతం, బయట మరో మతంపై మాట్లాడే నాయకులను నమ్మొద్దని, తమ ప్రభుత్వంలో ఆలయాల నిర్వహణ సవ్యంగా సాగుతోందన్నారు.
News October 14, 2024
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం
AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఇది రానున్న 48 గంటల్లో బలపడి పశ్చిమ వాయవ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాల వైపు కదిలే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవొచ్చని వెల్లడించింది. బుధ, గురువారాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని పేర్కొంది.
News October 14, 2024
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను: జగ్గారెడ్డి
TG: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని కాంగ్రెస్ నేత, సంగారెడ్డి మాజీ MLA జగ్గారెడ్డి ప్రకటించారు. తన భార్య నిర్మలారెడ్డి లేదా తన అనుచరుడు ఆంజనేయులతో పోటీ చేయిస్తానని తెలిపారు. ‘దీనిపై CM రేవంత్, మహేశ్ కుమార్ గౌడ్తో చర్చిస్తా. గత ఎన్నికల్లో BRS నేతలు ఓటుకు రూ.2వేలు ఇచ్చి నన్ను ఓడించారు. ఓడినా ప్రజల మధ్యే ఉంటూ అభివృద్ధికి నిధులు తెస్తా’ అని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.