News December 12, 2024

ఉపాధి కల్పించే రాజధానిగా అమరావతి: సీఎం చంద్రబాబు

image

AP: అమరావతి ప్రజా రాజధాని అని, యువతకు ఉపాధి కల్పించే ప్రాంతంగా తీర్చి దిద్దుతామని రెండో రోజు కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు తెలిపారు. విశాఖ, తిరుపతి, అమరావతిపై ప్రత్యేక ఫోకస్ ఉంటుందన్నారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలను కల్పించే లక్ష్యంతో పనిచేస్తున్నామని, యువతలో నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అమరావతిలో రూ.20,500 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు.

Similar News

News January 5, 2026

సెంచరీలు బాదడంలో ఇతని ‘రూటే’ సపరేటు!

image

ఇంగ్లండ్ ప్లేయర్ జో రూట్ టెస్టుల్లో నీళ్లు తాగినంత ఈజీగా సెంచరీలు బాదుతున్నారు. 2021 నుంచి అతను ఏకంగా 24 శతకాలు కొట్టడమే దీనికి నిదర్శనం. రూట్ తర్వాత ప్లేస్‌లో నలుగురు ప్లేయర్లు ఉండగా, వారిలో ఒక్కొక్కరు చేసిన సెంచరీలు 10 మాత్రమే. ఈ ఫార్మాట్ ఆడుతున్న యాక్టివ్ ప్లేయర్లలో సచిన్ టెస్ట్ సెంచరీల(51) రికార్డును బద్దలు కొట్టే సత్తా ప్రస్తుతం రూట్‌కే ఉంది. తాజాగా యాషెస్‌లో ఆయన 41వ సెంచరీ సాధించారు.

News January 5, 2026

అమెరికా దాడిలో మదురో సెక్యూరిటీ టీమ్ క్లోజ్!

image

వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించే క్రమంలో అమెరికా సైన్యం జరిపిన ఆపరేషన్ పెను విధ్వంసానికి దారితీసింది. ఈ దాడిలో మదురో సెక్యూరిటీ టీమ్‌లో మెజారిటీ సభ్యులు చనిపోయినట్లు ఆ దేశ రక్షణ మంత్రి పాడ్రినో సంచలన ప్రకటన చేశారు. US బలగాలు ‘కోల్డ్ బ్లడెడ్’గా తమ సైనికులు, అమాయక పౌరులను పొట్టనబెట్టుకున్నాయని ఆరోపించారు. తమ నేతను వెంటనే విడుదల చేయాలని వెనిజులా సైన్యం డిమాండ్ చేసింది.

News January 5, 2026

రబీ వరిలో ఈ సమస్యలు కనిపిస్తున్నాయా?

image

తెలుగు రాష్ట్రాల్లో వరి పంట ఒక్కో ప్రాంతంలో ఒక్కో దశలో ఉంది. అయితే వరి ప్రారంభ దశ నుంచి జింకు లోపం, కాండం తొలుచు పురుగు పంటపై తీవ్ర ప్రభావం చూపుతాయి. జింకు లోపం వల్ల వరి పొలాల్లో పిలకలు ఆలస్యంగా, తక్కువగా వచ్చి పైరు సరిగా పెరగదు. ఇక కాండం తొలుచు పురుగు మొక్క మొవ్వులోకి చొచ్చుకెళ్లి పంటకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. వరిలో జింకు లోపం, కాండం తొలుచు పురుగు నివారణకు సూచనల కోసం <<-se_10015>>పాడిపంట క్లిక్<<>> చేయండి.