News March 7, 2025
మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి: మంత్రి నారాయణ

AP: రాజధాని అమరావతి నిర్మాణం 3 ఏళ్లలో పూర్తవుతుందని మంత్రి నారాయణ తెలిపారు. హడ్కో, ప్రపంచ బ్యాంకు ద్వారా తీసుకునే రుణాలు.. అమరావతిలో భూముల అమ్మకంతో వచ్చే నిధులనే రాజధాని కోసం వాడతామన్నారు. ప్రజలు కట్టే పన్నుల నుంచి ఒక్కపైసా కూడా వాడబోమని వెల్లడించారు. రోడ్లు, డ్రైనేజీ, పార్కుల వంటి వసతులు పూర్తైతే భూముల ధర పెరుగుతుందని చెప్పారు. ఇప్పటికైనా రాజధానిపై YCP ఓ విధానంతో ముందుకు రావాలని హితవు పలికారు.
Similar News
News April 6, 2026
ట్రంప్ను పదవి నుంచి తొలగిస్తారా?

ట్రంప్ను అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తారనే ఊహాగానాలు పెరుగుతున్నాయి. ఓ చట్టసభ్యుడు కూడా అందుకు ప్రతిపాదించారని సమాచారం. కాల్షీ వంటి బెట్టింగ్ ప్లాట్ఫామ్స్లో ఆయన తొలగింపుపై పందెం వేసే వారి సంఖ్య పెరుగుతోంది. ఇరాన్తో యుద్ధం, కీలక నిర్ణయాల్లో ఆయన వ్యవహారశైలే అందుకు కారణం. ట్రంప్ను 25వ అమెండ్మెంట్ ఆధారంగా తొలగిస్తారా అనే ప్రశ్నకు ‘Yes’ అన్నవారి సంఖ్య గతనెలలో 28.6% ఉండగా ఇప్పుడది 35.1%కి చేరింది.
News April 6, 2026
₹6.5 లక్షల కోట్లకు బంగారం దిగుమతులు

గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి వరకు దేశంలోకి బంగారం దిగుమతులు 28.73% పెరిగాయి. వీటి విలువ సుమారు ₹6.5 లక్షల కోట్లుగా నమోదైంది. పసిడి ధరలు భారీగా పెరగడమే దీనికి కారణం. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర ₹1,50,000 దాటిపోయింది. స్విట్జర్లాండ్ నుంచి అత్యధికంగా 40% బంగారం దిగుమతి అవుతోంది. ఈ దిగుమతుల ప్రభావంతో దేశ వాణిజ్య లోటు కూడా పెరిగి ₹29.20 లక్షల కోట్లకు చేరినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
News April 6, 2026
ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ సెటైర్లు!

హార్ముజ్ జలసంధిని తెరవకపోతే నరకానికి పంపుతానంటూ బూతులతో ట్రంప్ <<19575126>>హెచ్చరించడం<<>>పై ఇరాన్ సెటైర్లు వేస్తోంది. ‘ఓ టీనేజర్లా అధ్యక్షుడు బూతులు తిట్టే తీరు చూస్తుంటే.. అమెరికా ఊహించిన దాని కంటే ముందే రాతియుగానికి చేరుకున్నట్లు కనిపిస్తోంది’ అని థాయ్లాండ్లోని ఇరాన్ ఎంబసీ ఎద్దేవా చేసింది. ‘ట్రంప్.. ఇంకేదైనా మాట్లాడవా. బోర్ కొడుతోంది’ అంటూ జింబాబ్వేలోని ఎంబసీ ఎగతాళి చేసింది.


