News March 18, 2025

ఏప్రిల్ 15 తర్వాత ‘అమరావతి’ పనులు

image

AP: వచ్చే నెల 15 తర్వాత రాజధాని అమరావతి పనులు పున:ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తాత్కాలిక సచివాలయం వెనుక ఉన్న ప్రాంతంలో తొలుత పనులు మొదలుపెట్టనుంది. అక్కడే ప్రధాని మోదీతో సభను నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని సీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. కాగా ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు ప్రధానిని ఆహ్వానించనున్నారు.

Similar News

News December 4, 2025

గోల్డ్ లోన్? పర్సనల్ లోన్? ఏది బెటర్

image

మీ దగ్గర బంగారం ఉంటే గోల్డ్ లోన్ తీసుకోవడం గుడ్ ఛాయిస్. అత్యవసరంగా డబ్బులు అవసరమైతే బంగారం తాకట్టు పెట్టి బ్యాంకులో లోన్ తీసుకోవచ్చు. తనఖా పెట్టిన కొద్దిసేపటికే డబ్బులు అకౌంట్‌లో డిపాజిట్ అవుతాయి. నెల నెలా వడ్డీ కట్టే సమస్య ఉండదు. సంవత్సరం చివరిలో లేదంటే మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు చెల్లించి మీ బంగారం వెనక్కి తీసుకోవచ్చు. పర్సనల్ లోన్ EMI చెల్లింపు మిస్ అయితే వడ్డీ ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది.

News December 4, 2025

రష్యాకు ఫుడ్.. మనకు ఆయిల్!

image

ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ముడిచమురు దిగుమతిదారు భారత్. ఉక్రెయిన్‌తో యుద్ధం తర్వాత రష్యాపై పలు దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో ఆ దేశం నుంచి ఆయిల్‌ను IND అతితక్కువ ధరకే కొనుగోలు చేస్తోంది. ఈ డీల్‌ను మరో ఎత్తుకు తీసుకెళ్లేందుకు పుతిన్ పర్యటనలో ఒప్పందం కుదరనుంది. ‘ఫుడ్ ఫర్ ఆయిల్’ డీల్‌ $60 బిలియన్లకు పెరగనుంది. దీని ప్రకారం భారత్ వ్యవసాయ ఉత్పత్తులను రష్యాకు ఎగుమతి చేస్తే.. ఆ దేశం ఆయిల్‌ను పంపనుంది.

News December 4, 2025

ఇతిహాసాలు క్విజ్ – 86 సమాధానాలు

image

ఈరోజు ప్రశ్న: పార్వతీ దేవి అవతారంగా, శక్తి స్వరూపిణిగా, విష్ణుమూర్తి సోదరిగా పరిగణించబడే, ఈశ్వరుడు వివాహం చేసుకున్న దేవత ఎవరు? అలాగే, ఆమెకు తమిళనాడులో ఒక ప్రసిద్ధ ఆలయం కూడా ఉంది. ఆమెతో పాటు ఒక పచ్చ చిలుక కూడా కనిపిస్తుంది.
సమాధానం: మధుర మీనాక్షి అమ్మవారు. ఈ దేవత ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని మధురలో ఉంది.
<<-se>>#Ithihasaluquiz<<>>