News July 1, 2024
అమర్నాథ్ యాత్ర.. రెండు కాళ్లు లేకపోయినా 12వ సారి..

అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నవారే అమర్నాథ్ గుహకు చేరుకోవాలంటే అష్టకష్టాలు పడతారు. కానీ RJలోని జైపూర్కు చెందిన ఆనంద్ సింగ్ రెండు కాళ్లు లేకున్నా 12వ సారి యాత్రకు బయలుదేరారు. శివ భక్తుడైన ఆనంద్ 2002లో ఓ ప్రమాదంలో కాళ్లు కోల్పోయారు. అయినా పరమశివుడిపై అంతులేని భక్తితో సాహసయాత్ర చేశారు. ఇదివరకు కట్ చేసిన ట్రక్ టైరులో కూర్చొని రెండు చేతుల సాయంతో నెట్టుకుంటూ వెళ్లగా.. ఈసారి పల్లకిలో వెళ్తున్నారు.
Similar News
News December 2, 2025
ఐఐసీటీ హైదరాబాద్లో ఉద్యోగాలు

హైదరాబాద్లోని CSIR-<
News December 2, 2025
దూడలకు వ్యాధినిరోధక టీకాలు ఎప్పుడు వేయించాలి?

☛ 6 నుంచి 8 వారాల వయసులో తొలిసారి గాలికుంటు వ్యాధి టీకా వేయించాలి. తర్వాత 3 నెలల్లో బూస్టర్ డోస్ ఇవ్వాలి.
☛ 4 నెలల వయసులో(ముఖ్యంగా సంకర జాతి దూడలకు) థైలీరియాసిస్ టీకా వేయించాలి.
☛ 6 నెలల వయసు దాటాక గొంతువాపు వ్యాధి రాకుండా టీకా వేయించాలి. ☛ 6- 12 నెలల వయసులో గొంతువాపు వ్యాధి టీకా వేయించిన 15-20 రోజుల తర్వాత జబ్బవాపు రాకుండా టీకా వేయించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు.
News December 2, 2025
ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్: కేంద్రం

గత ఐదేళ్లలో దేశంలో 2,04,268 ప్రైవేట్ కంపెనీలు మూతపడ్డాయని లోక్సభలో కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా వెల్లడించారు. విలీనాలు, రిజిస్ట్రేషన్ రద్దు వంటి రీజన్స్తో ఇవి క్లోజ్ అయ్యాయని తెలిపారు. అత్యధికంగా 2022-23లో 83,452, అత్యల్పంగా 2020-21లో 15,216 కంపెనీలు మూత పడ్డాయని పేర్కొన్నారు. ఆయా సంస్థల ఉద్యోగులకు పునరావాసం కల్పించే ప్రతిపాదన ప్రభుత్వానికి లేదని చెప్పారు.


