News April 15, 2024
నేటి నుంచి అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్లు ప్రారంభం

ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర జూన్ 29 నుంచి ప్రారంభం కానున్నట్లు ఆలయ బోర్డు ప్రకటించింది. 52 రోజుల పాటు సాగే ఈ యాత్రకు నేటి నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. ఆన్లైన్, ఆఫ్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు www.jksasb.nic.in వెబ్సైట్ను సంప్రదించవచ్చు. కాగా ఈ యాత్రకు 13 నుంచి 70 ఏళ్ల మధ్య వారినే అనుమతిస్తారు.
Similar News
News March 4, 2026
4 నెలల బాబుకు ప్రాణం పోశారు!

TG: ఆరోగ్య సమస్యలు, తక్కువ బరువు(2.8kgs)తో కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన 4నెలల బాబు ప్రాణాలను డాక్టర్లు కాపాడారు. కాలిన గాయాలు, రక్తహీనత, శ్వాస సమస్యలతో బాధపడుతున్న మడకం శివ అనే చిన్నారిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకొచ్చారు. 36 రోజుల చికిత్స తర్వాత బాలుడి బరువు 4.25kgsకి పెరిగింది. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. చిన్నారికి మెరుగైన చికిత్స అందించిన డాక్టర్లపై ప్రశంసలొస్తున్నాయి.
News March 4, 2026
సౌదీపై దాడులు వద్దు.. ఇరాన్కు పాక్ వార్నింగ్!

గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తున్న ఇరాన్కు పాకిస్థాన్ వార్నింగ్ ఇచ్చింది. సౌదీ అరేబియాపై దాడులు చేయవద్దని చెప్పింది. సౌదీతో తమ రక్షణ ఒప్పందం గురించి గుర్తుచేసింది. తమకు వ్యతిరేకంగా సౌదీ భూభాగాన్ని ఉపయోగించకుండా చూడాలని ఇరాన్ తమకు చెప్పినట్లు పాక్ మంత్రి ఇషాక్ధర్ వెల్లడించారు. కాగా రెండు దేశాల్లో ఏ ఒక్కదానిపై దాడి జరిగినా రెండింటిపై జరిగినట్లుగా పరిగణించాలని సౌదీ-పాక్ <<17745790>>డీల్<<>> చేసుకున్న సంగతి తెలిసిందే.
News March 4, 2026
TPCC జాబితా: ఛాన్సు దక్కేదెవరికో!

TG: రాజ్యసభ సీటు కోసం INCలో పోటీ రసవత్తరంగా మారింది. రాష్ట్రం నుంచి సామాజిక వర్గాల వారీగా 16 పేర్లతో జాబితాను AICCకి పంపామని TPCC చీఫ్ మహేశ్ కుమార్ తెలిపారు. వారిని ఢిల్లీకి పిలిచి మాట్లాడో లేదా ఫోన్లోనే చర్చించో తుది నిర్ణయం తీసుకోవచ్చన్నారు. కాగా VH, వేం నరేందర్ రెడ్డి, జీవన్ రెడ్డి వంటి నేతలతో పాటు కొందరు ప్రముఖులనూ జాబితాలో చేర్చినట్లు తెలుస్తోంది. వీరిలో ఎవరికి ఛాన్సు దక్కుతుందో చూడాల్సిందే.


