News May 11, 2024
అద్భుతం.. తిండి, నీళ్లు లేకుండా 5 రోజులు బతికాడు

దక్షిణాఫ్రికాలో ఓ వ్యక్తి మృత్యువును జయించాడు. ఈ నెల 6న నిర్మాణంలో ఉన్న ఓ భవనం కూలిపోగా, శిథిలాల్లో ఇరుక్కుపోయిన అతడిని 5 రోజుల తర్వాత రెస్క్యూ సిబ్బంది కాపాడారు. ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. కాలిపై బరువైన శిథిలం పడటంతో అతను కదలకుండా ఉండిపోయాడని అధికారులు తెలిపారు. 116 గంటలపాటు తిండి, నీళ్లు లేకుండా జీవించడం అద్భుతమంటున్నారు. కాగా బిల్డింగ్ కూలిన ఘటనలో 13 మంది మరణించారు.
Similar News
News November 27, 2025
వేరుశనగ, మొక్కజొన్న పంటలకు పందుల నుంచి రక్షణ ఇలా..

వేరుశనగ, మొక్కజొన్న పంటలకు పందుల నుంచి ముప్పు ఎక్కువగా ఉంటుంది. దీనికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వేరుశనగ పొలం చుట్టూ 4 వరుసల్లో కుసుమ పంట వేస్తే ఆ మొక్క ముళ్లు పందిని గాయపర్చే అవకాశం ఉంది. కుసుమ మొక్క వాసన ఘాటుగా ఉండడం వల్ల వేరుశనగ పంట వైపు పందులు రావు. మొక్కజొన్న పంట చుట్టూ ఆముదం పంటను వేసి రక్షించుకోవచ్చు. అలాగే ముళ్లు గల ఎడారి మొక్కలు, వాక్కాయ మొక్కలను పెంచి పంటలను కాపాడుకోవచ్చు.
News November 27, 2025
RVNLలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (<
News November 27, 2025
డిసెంబర్లో నింగిలోకి రోబో: ఇస్రో ఛైర్మన్

ఏడాదికి 50 శాటిలైట్ల చొప్పున వచ్చే మూడేళ్లలో 150 శాటిలైట్లను ప్రయోగించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ఇస్రో ఛైర్మన్ నారాయణన్ తెలిపారు. విపత్తులకు సంబంధించిన కచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు అందించేలా శాటిలైట్లను ప్రయోగిస్తున్నామన్నారు. 2035 నాటికి సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నామని తెలిపారు. ఈ డిసెంబర్లో నింగిలోకి రోబోను పంపేందుకు చర్యలు ముమ్మరంగా సాగుతున్నట్టు నారాయణన్ చెప్పారు.


