News May 11, 2024

అద్భుతం.. తిండి, నీళ్లు లేకుండా 5 రోజులు బతికాడు

image

దక్షిణాఫ్రికాలో ఓ వ్యక్తి మృత్యువును జయించాడు. ఈ నెల 6న నిర్మాణంలో ఉన్న ఓ భవనం కూలిపోగా, శిథిలాల్లో ఇరుక్కుపోయిన అతడిని 5 రోజుల తర్వాత రెస్క్యూ సిబ్బంది కాపాడారు. ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. కాలిపై బరువైన శిథిలం పడటంతో అతను కదలకుండా ఉండిపోయాడని అధికారులు తెలిపారు. 116 గంటలపాటు తిండి, నీళ్లు లేకుండా జీవించడం అద్భుతమంటున్నారు. కాగా బిల్డింగ్ కూలిన ఘటనలో 13 మంది మరణించారు.

Similar News

News October 16, 2025

ఇదే నాకు చివరి దీపావళి: యువకుడి ఎమోషన్

image

తనపై క్యాన్సర్ గెలిచిందని ఓ యువకుడు(21) Redditలో ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ‘2023లో పెద్దపేగు క్యాన్సర్ అని తెలిసి ఎన్నో రోజులు ఆస్పత్రిలో కీమోథెరపీ చికిత్స తీసుకున్నా. స్టేజ్4లోని నేను ఇంకో ఏడాదే ఉంటానని డాక్టర్లు చెప్పారు. వీధుల్లో దీపావళి సందడి కన్పిస్తోంది. నాకు ఇవే చివరి వెలుగులు, నవ్వులు. నా జీవితం, కలలు కరిగిపోతున్నాయనే బాధ కుటుంబంలో చూస్తున్నా’ అని చేసిన పోస్ట్ ప్రతి ఒక్కర్నీ కదిలిస్తోంది.

News October 16, 2025

లేటెస్ట్ సినిమా అప్‌డేట్స్

image

▸సుధీర్ బాబు నటించిన ‘జటాధర’ సినిమా ట్రైలర్‌ను రేపు విడుదల చేయనున్న మహేశ్ బాబు
▸వెట్రిమారన్, శింబు కాంబోలో వస్తోన్న ‘అరసన్'(తెలుగులో సామ్రాజ్యం) సినిమా ప్రోమోను రేపు రిలీజ్ చేయనున్న Jr.NTR
▸విక్రమ్ కె.కుమార్ డైరెక్షన్‌లో విజయ్ దేవరకొండ సినిమా చేసే అవకాశం?
▸ మెటా AIకి దీపికా పదుకొణె వాయిస్.. తొలి ఇండియన్ సెలబ్రిటీగా రికార్డు

News October 16, 2025

PHOTO GALLERY: మోదీ ఏపీ పర్యటన

image

AP: ప్రధాని మోదీ ఇవాళ ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించారు. తొలుత శ్రీశైలంలో భ్రమరాంబికా దేవి, మల్లికార్జున స్వామి వార్లకు పూజలు చేశారు. అనంతరం గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్, కేంద్రమంత్రులు రామ్మోహన్, పెమ్మసాని, భూపతి రాజులతో కలిసి బహిరంగ సభలో పాల్గొన్నారు. మోదీ పర్యటన ఫొటోలను పైన గ్యాలరీలో చూడండి.