News January 18, 2025

జియో రీఛార్జ్ ప్లాన్.. రూ.49కే..

image

ప్రముఖ టెలికం కంపెనీ జియో రూ.49కే అన్‌లిమిటెడ్ డేటాను అందిస్తోంది. దీని వ్యాలిడిటీ 24 గంటలు. ఒకరోజు అపరిమిత డేటా కావాలనుకునేవారికి ఈ రీఛార్జ్ ప్లాన్ మంచి ఆప్షన్. కానీ ఇందులో కాలింగ్, SMS సౌకర్యం పొందలేరు. రూ.11కే గంటపాటు అన్‌లిమిటెడ్ డేటా రీఛార్జ్ ప్లాన్‌ను కూడా Jio తీసుకొచ్చింది. ఇప్పటికే జియో నుంచి తీవ్రపోటీ ఎదుర్కొంటున్న Airtel, VI, BSNLకి ఈ కొత్త ప్లాన్లు మరింత సవాలుగా మారే అవకాశాలున్నాయి.

Similar News

News January 21, 2026

శబరిమల ఆలయం ఎప్పుడు తెరుస్తారంటే?

image

శబరిమలలో 2నెలలు కొనసాగిన మండల-మకరవిలక్కు ముగియడంతో ఆలయాన్ని అధికారులు మూసేశారు. మళ్లీ ఫిబ్రవరిలో జరగబోయే నెలవారీ పూజల కోసం ఆలయాన్ని తిరిగి తెరవనున్నారు. ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డ్ తెలిపిన వివరాల ప్రకారం ఆలయాన్ని FEB 12 సా.5 గంటలకు తెరుస్తారు. పూజలు 17వ తేదీ రా.10గం.కు వరకు కొనసాగుతాయి. అప్పుడూ భక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చు. గతంలో మాదిరే ఆన్‌లైన్ బుకింగ్, దర్శన టోకెన్లు కొనసాగుతాయి.

News January 21, 2026

దావోస్‌లో సీఎం రేవంత్, చిరంజీవి

image

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ‘జాయిన్ ది రైజ్’ కార్యక్రమంలో తెలంగాణ విజన్‌ను ప్రదర్శించగా.. ఆ కార్యక్రమంలో సీఎం రేవంత్, చిరంజీవి, మంత్రులు పక్కపక్కనే కూర్చున్నారు. ఆప్యాయంగా మాట్లాడుకుని కలిసి విందులో పాల్గొన్నారు. అయితే గ్లోబల్ బిజినెస్ లీడర్లు, పాలసీ నిర్ణేతలు పాల్గొనే ఈ ప్రోగ్రాంకు మెగాస్టార్ ఎందుకు వెళ్లారనే దానిపై క్లారిటీ రాలేదు.

News January 21, 2026

మహిళల్లో షుగర్ వచ్చే ముందు కనిపించే లక్షణాలు

image

మహిళల్లో మధుమేహం వచ్చేముందు కొన్ని ప్రత్యేక లక్షణాలు కనిపిస్తాయి. వాటిని విస్మరించకూడదంటున్నారు నిపుణులు. కొన్నిసార్లు మధుమేహం హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుంది. దీంతో పీరియడ్స్ గతి తప్పుతాయి. చర్మం ఎర్రగా మారడం, దురద రావడం, జననేంద్రియాలు పొడిబారడంతో పాటు నాడీ వ్యవస్థ దెబ్బతిని చేతులు, కాళ్ళలో జలదరింపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని గమనించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.