News December 19, 2024
అంబేడ్కర్ ఓడింది కాంగ్రెస్ హయాంలోనే: చంద్రబాబు

AP: ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలపై CM చంద్రబాబు మంత్రులతో చర్చించారు. మనం మంచి ఉద్దేశంతో మాట్లాడినా దానిని చెడుగా చిత్రీకరించేందుకు కొందరు ఎదురు చూస్తుంటారని సీఎం అన్నారు. ‘గతంలో నేను వ్యవసాయం దండగ అని అనలేదు. కానీ అన్నట్లు కొందరు ప్రచారం చేశారు. ఇప్పుడు అమిత్ షాపై కూడా ఇదే ప్రచారం జరుగుతోంది. అసలు అంబేడ్కర్ ఓడిపోయింది కాంగ్రెస్ హయాంలోనే. ఆ పార్టీ హయాంలోనే ఆయనకు గౌరవం దక్కలేదు’ అని పేర్కొన్నారు.
Similar News
News November 15, 2025
మూవీ ముచ్చట్లు

* Globetrotter ఈవెంట్లో SSMB29 టైటిల్ వీడియో ప్లే అయ్యాక ఆన్లైన్లో రిలీజ్ చేస్తాం: రాజమౌళి
* రజినీకాంత్ హీరోగా తాను నిర్మిస్తున్న ‘తలైవర్ 173’ మూవీ నుంచి డైరెక్టర్ సి.సుందర్ తప్పుకున్నట్లు ప్రకటించిన కమల్ హాసన్
* దుల్కర్ సల్మాన్-భాగ్యశ్రీ బోర్సే కాంబోలో వచ్చిన ‘కాంత’ చిత్రానికి తొలిరోజు రూ.10.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్
* రోజుకు 8 గంటల పని శరీరానికి, మనసుకు సరిపోతుంది: దీపికా పదుకొణె
News November 15, 2025
వట్టి నేలపై కూర్చోకూడదా?

మన శాస్త్రాల ప్రకారం.. వట్టి నేలపై నేరుగా కూర్చోకూడదు. తప్పనిసరిగా వస్త్రం/పీట/ చాపను ఉపయోగించాలి. మన శరీరం విద్యుత్ కేంద్రం వంటిది. భూమికి అయస్కాంత తత్వం ఉంటుంది. నేరుగా కూర్చున్నప్పుడు, మన శరీరంలోని జీవ విద్యుత్ శక్తి భూమిలోకి ప్రసరించి, వృథా అవుతుంది. ఇలా శరీరంలోని శక్తి తగ్గుతుంది. ఆ ప్రభావం మన ఆరోగ్యంపై పడి, వ్యాధులు రావొచ్చు. ఆ శక్తిని కాపాడుకోవడానికి ఈ నియమం పెట్టారు. <<-se>>#Scienceinbelief<<>>
News November 15, 2025
ఇకపై ఎలక్ట్రిక్ బస్సులే కొంటాం: మంత్రి మండిపల్లి

APSRTCని బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి చెప్పారు. ఇకపై డీజిల్ బస్సులను కొనబోమని, రాబోయే మూడేళ్లలో ఎలక్ట్రిక్ బస్సులను మాత్రమే కొనుగోలు చేస్తామని తెలిపారు. భవిష్యత్తులో గ్రామీణ ప్రాంతాల్లోనూ ఏసీ బస్సులు నడిపేలా చర్యలు తీసుకుంటామన్నారు. స్త్రీ శక్తి పథకం బాగా నడుస్తోందని, దీనిపై తప్పుడు ప్రచారం చేసిన వాళ్లు ఇప్పుడు మౌనం వహించారని ఎద్దేవా చేశారు.


