News August 7, 2025
దూర ప్రయాణాలు చేసే వారి కోసం త్వరలో ఎమినిటీ సెంటర్లు!

దేశవ్యాప్తంగా నేషనల్ హైవేల పక్కన 5వేల వేసైడ్ ఎమినిటీ(WSA) సెంటర్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దూర ప్రయాణాలు చేసే వారు, భారీ వాహనాల డ్రైవర్లు వీటిలో విశ్రాంతి తీసుకోవచ్చు. ప్రతి 30-40kmsకి ఒకటి చొప్పున ఏర్పాటు కానున్నాయి. ఈ కేంద్రాల్లో పార్కింగ్ స్థలం, ఫుడ్, ఫ్యూయెల్, టాయిలెట్లు వంటి సదుపాయాలు ఉంటాయి. ఇందుకు సంబంధించిన ముసాయిదాను ప్రభుత్వం గత వారం విడుదల చేసింది.
Similar News
News August 7, 2025
ఈ ‘స్వామి’ ఆకలి కేకలను దూరం చేశాడు

భారత రత్న, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ MS స్వామినాథన్ 3 పదుల వయసులోనే దేశ భవిష్యత్ మార్చారు. కరవుతో అల్లాడుతున్న ప్రజలకు కాంతిరేఖలా మారారు. జపాన్, US, మెక్సికో శాస్త్రవేత్తలతో కలిసి వరి, గోధుమ వంగడాలపై ఆయన చేసిన పరిశోధనలు ఆకలి కేకలను దూరం చేశాయి. ఆ తర్వాత భారత్ వెనుతిరిగి చూడలేదు. విదేశాలకు ఆహార ఉత్పత్తులు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుందాం.
News August 7, 2025
రేషన్ లబ్ధిదారులకు నిరాశ

AP: రేషన్ షాపుల్లో కందిపప్పు ఈ నెల కూడా పంపిణీ చేయకపోవడంతో లబ్ధిదారులు నిరాశ చెందుతున్నారు. కొంతకాలంగా సరఫరా నిలిచిపోగా, పండుగల సీజన్ కావడంతో ఈసారి ఇస్తారని అంతా భావించారు. షాపులకు వెళ్లాక అసలు విషయం తెలిసి అసంతృప్తి చెందుతున్నారు. కొన్నిచోట్ల అరకొరగా పంపిణీ జరుగుతున్నట్లు తెలుస్తోంది. మార్కెట్లో KG ₹120 ఉండటంతో రేషన్ షాపుల్లో పంపిణీ చేయాలని కోరుతున్నారు. మీకు కందిపప్పు అందిందా? కామెంట్ చేయండి.
News August 7, 2025
మళ్లీ పెరిగిన గోల్డ్ & సిల్వర్ రేట్స్!

బంగారం ధరలు క్రమంగా పెరుగుతూ కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. వరుసగా నాలుగో రోజూ పెరిగి షాకిచ్చాయి. హైదరాబాద్లో ఇవాళ 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర ₹220 పెరిగి ₹1,02,550కు చేరింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర ₹200 పెరిగి ₹94,000 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.1,000 పెరిగి రూ.1,27,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.