News March 11, 2025
ఆర్థికమాంద్యం ముప్పులో అమెరికా!

అమెరికా స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ నిబంధనలతో ఆర్థిక వ్యవస్థ మందగిస్తుందని ఇన్వెస్టర్లు భావించడంతో నాస్డాక్ 4 శాతం క్షీణించింది. 2022 తర్వాత ఒక్కరోజులో అతిపెద్ద నష్టం ఇదే. టెస్లా, Nvidia, మెటా, అమెజాన్, ఆల్ఫాబెట్ షేర్లు భారీగా నష్టపోయాయి. 1.9 ట్రిలియన్ డాలర్ల సంపద ఆవిరైంది. ఈ ఏడాది అమెరికాలో ఆర్థికమాంద్యం వచ్చే అవకాశాలు 40%కి పెరిగినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.
Similar News
News March 11, 2025
150 మంది సైనికుల ఊచకోత!

పాకిస్థాన్లో BLA (బలూచ్ లిబరేషన్ ఆర్మీ) నరమేధం సృష్టించింది. తమ అధీనంలో ఉన్న 450 మందిలో 150 మంది సైనికులను ఊచకోత కోసినట్లు బీఎల్ఏ స్వయంగా ప్రకటించింది. తమపై సైనిక చర్యకు దిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. కాగా బలూచిస్థాన్ ప్రావిన్స్లో జాఫర్ ఎక్స్ప్రెస్ను బీఎల్ఏ హైజాక్ చేసిన విషయం తెలిసిందే. ఆ రైలులో ప్రయాణిస్తున్న వందలాదిమందిని బందీలుగా తీసుకున్నారు.
News March 11, 2025
KCRను కలిసిన దాసోజు శ్రవణ్

TG: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి దాసోజు శ్రవణ్ మాజీ సీఎం కేసీఆర్ను కలిశారు. తనకు MLCగా అవకాశం ఇచ్చినందుకు కుటుంబ సమేతంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. అటు దాసోజుకు కేసీఆర్ అభినందనలు తెలిపారు.
News March 11, 2025
రేపు 1532మందికి ఉద్యోగ నియామక పత్రాలు

TG: జూనియర్ లెక్చరర్(1292మంది), పాలిటెక్నిక్ లెక్చరర్(240మంది) ఉద్యోగాలకు ఎంపికైన వారికి సీఎం రేవంత్ రేపు నియామక పత్రాల్ని అందించనున్నారు. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ఈ కార్యక్రమం జరగనుంది. కొత్తగా కొలువుల్లోకి చేరే ఈ సిబ్బందికి విద్యాశాఖ విధానాలు, బోధనాపద్ధతులపై ట్రైనింగ్ అనంతరం పోస్టింగ్స్ ఇస్తామని విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా తెలిపారు.