News June 24, 2024

వరల్డ్ కప్ నుంచి అమెరికా ఔట్

image

టీ20 వరల్డ్ కప్ నుంచి అతిథ్య అమెరికా జట్టు నిష్క్రమించింది. సూపర్-8లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయి సెమీఫైనల్ రేసుకు దూరమైంది. దీంతో సూపర్-8 నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా యూఎస్ఏ నిలిచింది. కాగా యూఎస్ఏ జట్టు లీగ్ మ్యాచుల్లో అదరగొట్టింది. పాకిస్థాన్, కెనడాపై గెలిచి సూపర్-8లో అడుగుపెట్టింది. ఇండియాపై ఓ మ్యాచ్ ఓడగా, ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది.

Similar News

News October 9, 2024

గ్రూప్-1 మెయిన్స్‌పై కీలక అప్‌డేట్

image

TG: గ్రూప్-1 మెయిన్స్ హాల్ టికెట్లను ఈనెల 14న విడుదల చేయనున్నట్లు TGPSC ప్రకటించింది. అదే రోజు నుంచి కమిషన్ వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఈనెల 21 నుంచి 27వ తేదీ వరకు మెయిన్స్ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే.

News October 9, 2024

JOE ROOT: ‘గే’ అని గేలి చేసినా..!

image

టెస్టు క్రికెట్‌లో ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ అన్‌స్టాపబుల్‌గా దూసుకెళ్తున్నారు. గత నాలుగేళ్లలో అత్యుత్తమ ఫామ్ ప్రదర్శించి ఏకంగా 18 సెంచరీలు బాదారు. కాగా రూట్ 2021కు ముందు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. తరచూ ఆయనను ప్రత్యర్థులు ‘గే’ అంటూ ఎగతాళి చేసేవారు. ఆయన వాటినేం పట్టించుకోకుండా ఆటపైనే దృష్టి పెట్టేవారు. అతడిని ‘గే’ అని పిలిచినందుకు వెస్టిండీస్ బౌలర్ గాబ్రియేల్ 4 మ్యాచ్‌ల నిషేధం కూడా ఎదుర్కొన్నారు.

News October 9, 2024

3 రోజుల్లోనే ఖాతాల్లోకి డబ్బులు: మంత్రి

image

TG: ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత 3 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. నల్గొండ(D) అర్జాలబావి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. సన్న రకాల సాగును ప్రోత్సహించేందుకే రూ.500 బోనస్ ఇస్తున్నామని అన్నారు. రుణమాఫీ కాని రైతులకు వారం రోజుల్లో పూర్తవుతుందని చెప్పారు.