News March 27, 2025
మమతా బెనర్జీ ప్రభుత్వంపై అమిత్ షా ఫైర్

పశ్చిమ బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫైరయ్యారు. ఆ రాష్ట్రం నుంచే రోహింగ్యాలు, బంగ్లాదేశ్ అక్రమ చొరబాటుదారులు దేశంలోకి ప్రవేశిస్తున్నారన్నారు. ఆ రాష్ట్ర సరిహద్దులో 450km మేర ఫెన్సింగ్ పని పెండింగ్లో ఉందని, దాని ఏర్పాటుకు మమతా ప్రభుత్వం భూమి ఇవ్వట్లేదని ధ్వజమెత్తారు. మరోవైపు, వచ్చే ఏడాది అక్కడ జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో BJP గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Similar News
News December 9, 2025
HURLలో అప్రెంటిస్ పోస్టులు

హిందుస్థాన్ ఉర్వరిక్ రసాయన్ లిమిటెడ్ (<
News December 9, 2025
ఇండియాస్ హాకీ విలేజ్ గురించి తెలుసా?

14 మంది ఒలింపియన్లు సహా 300 మంది హాకీ ప్లేయర్లను ఇచ్చింది పంజాబ్ జలంధర్ దగ్గరలోని సన్సర్పూర్. హాకీని సంస్కృతిగా చూశారు గనుకే ఒక ఒలింపిక్స్లో ఐదుగురు ఇండియాకు, ఇద్దరు హాకీ ప్లేయర్లు కెన్యాకు ఆడారు. హాకీనే ఊపిరిగా తీసుకున్న ఆ గ్రామ వైభవాన్ని వసతుల లేమి, వలసలు మసకబార్చాయి. టర్ఫ్ గ్రౌండ్స్, అకాడమీలు, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటుతో సన్సర్పూర్కు పునర్వైభవం తేవడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి.
News December 9, 2025
పెట్టుబడులకు ఆవిష్కరణలు తోడైతేనే $3T ఎకానమీ సాధ్యం: భట్టి

TG: తెలంగాణ రైజింగ్ కోసం తమ ప్రభుత్వం నియంత్రించేదిగా కాకుండా ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని Dy.CM భట్టి విక్రమార్క తెలిపారు. ‘‘TG ఇన్నోవేషన్ క్యాపిటల్ కావాలంటే ‘ఈజ్ ఆఫ్ ఇన్నోవేటింగ్’ వైపు సాగాలి. ఉత్పాదకత పెంపే తెలంగాణ సాధారణ పౌరుడి వేతనాలు, గౌరవాన్ని శాశ్వతంగా పెంచే ఏకైక మార్గం. ‘తెలంగాణ రైజింగ్ 2047’ పత్రం కాదు ప్రతిజ్ఞ’’ అని వివరించారు. పెట్టుబడులకు ఆవిష్కరణలు తోడైతేనే $3T ఎకానమీ సాధ్యమన్నారు.


