News April 24, 2024

25న తెలంగాణకు అమిత్ షా

image

TG: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 25న రాష్ట్రానికి రానున్నారు. లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా ప్రచారం నిర్వహించనున్నారు. జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని బాన్సువాడలో నిర్వహించే బహిరంగ సభలో షా పాల్గొననున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఇప్పటికే ప్రధాని మోదీ సైతం పలుమార్లు రాష్ట్రంలో పర్యటించిన సంగతి తెలిసిందే.

Similar News

News April 1, 2026

విమాన ఇంధన ధరకు రెక్కలు.. పెరగనున్న టికెట్ రేట్లు

image

విమానం ఇంధనం ధరలు ఆకాశాన్నంటాయి. కిలో లీటర్(1000 లీటర్లు) ఫ్లైట్ ఆయిల్ ధర రికార్డ్ స్థాయిలో రూ.2,07,341కి చేరింది. గతంలో కిలో లీటర్‌కు రూ.96,638 ఉండగా ఏకంగా రెట్టింపు ధర పెరగడం గమనార్హం. జెట్ ఫ్యూయల్ ధర రూ.2 లక్షల మార్కు దాటడం ఇదే తొలిసారి. ఇక మొత్తంగా గత నెలతో పోలిస్తే ఇంటర్నేషనల్ విమానాల ఫ్యూయల్ ధర 115%, డెమిస్టిక్‌లో 107% పెరిగింది. దీంతో విమాన టికెట్ల ధరలు భారీగా పెరిగే అవకాశముంది.

News April 1, 2026

కుప్పకూలిన విమానం.. 29 మంది మృతి

image

రష్యా సైనిక రవాణా విమానం కుప్పకూలింది. ఈస్ట్ యూరప్‌లోని క్రిమియాలో ఓ కొండను ఫ్లైట్ ఢీకొట్టిన ఘటనలో 29 మంది చనిపోయారు. మృతుల్లో ఆరుగురు సిబ్బంది, 23 మంది ప్రయాణికులు ఉన్నారు. సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 1, 2026

అకౌంట్‌లో ₹44, చేతిలో ₹40.. బరిలో 26ఏళ్ల అమ్మాయి!

image

కేరళంలోని ఎట్టుమనూర్‌లో ఆశ్నా థంపి అనే 26ఏళ్ల జర్నలిస్ట్ ఎన్నికల బరిలోకి దిగడం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. తనకు ఆస్తులేం లేవని.. ₹40 క్యాష్, బ్యాంక్ అకౌంట్‌లో ₹44 ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొనడమే ఇందుకు కారణం. SUCI(C) పార్టీ నుంచి పోటీ చేస్తున్న ఆమె కేరళం ఎన్నికల బరిలో ఉన్న అత్యంత పేద అభ్యర్థిగా నిలిచారు. ప్రజాస్వామ్యంలో డబ్బు కంటే ప్రజల సమస్యలే ముఖ్యమని ఆశ్నా చెబుతున్నారు. <<-se>>#Elections2026<<>>