News January 18, 2025
విజయవాడకు అమిత్ షా.. కాసేపట్లో చంద్రబాబు నివాసంలో డిన్నర్

AP: కేంద్ర హోంమంత్రి అమిత్ షా విజయవాడకు చేరుకున్నారు. గన్నవరం ఎయిర్పోర్టులో ఆయనకు మంత్రులు లోకేశ్, అనితతో పాటు 13 మంది కూటమి నేతలు స్వాగతం పలికారు. కాసేపట్లో షా ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో డిన్నర్ చేస్తారు. రాత్రికి ప్రైవేట్ హోటల్లో బస చేసే ఆయన రేపు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ 10వ బెటాలియన్ కార్యాలయం కొత్త క్యాంపస్ను ప్రారంభిస్తారు.
Similar News
News December 21, 2025
నేడే ఫైనల్.. వీళ్లు చెలరేగితే విజయం ఖాయం!

అండర్-19 ఆసియా కప్ వన్డే టోర్నీ ఆఖరి మజిలీకి చేరుకుంది. టీమ్ ఇండియా యంగ్స్టర్స్ నేడు దాయాది దేశంతో తలపడనున్నారు. ఇవాళ సూర్యవంశీ, అభిజ్ఞాన్ కుందు మరోసారి చెలరేగితే భారత్కు విజయం సునాయాసం అవుతుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు టీమ్ ఇండియా అన్ని గ్రూప్ మ్యాచుల్లో గెలిచింది. సెమీస్లో అయితే శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. ఇప్పటికే పాక్ను ఒకసారి 90 రన్స్ తేడాతో ఓడించింది.
News December 21, 2025
జాగ్రత్త.. వణికించేస్తున్న చలి

తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. నిన్న తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కోహీర్లో అత్యల్పంగా 4.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇవాళ ఉ.8.30 గంటల వరకు బయటకు రావొద్దని IMD 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు APలోని అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులలో నిన్న కనిష్ఠ ఉష్ణోగ్రత 4.7 డిగ్రీలుగా నమోదైంది. అరకులో 5.8, పాడేరులో 6.7, డుంబ్రిగుడలో 9.1గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
News December 21, 2025
పుష్య మాసంలో పర్వదినాలు

DEC 29: కపిలేశ్వర స్వామి తెప్పోత్సవం. 30: ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ద్వార దర్శనం. 31: కూర్మ ద్వాదశి, శ్రీవారి చక్రస్నానం. JAN 1: ప్రదోష వ్రతం. 3: శాకాంబరీ పౌర్ణమి. 4: శ్రీవారి సన్నిధిలో ప్రణయ కలహ మహోత్సవం. 6: సంకటహర చతుర్థి. 11: ఉత్తరాషాఢ కార్తె ప్రారంభం. 14: మతత్రయ ఏకాదశి, భోగి. 15: మకర సంక్రాంతి. 16: కనుమ. 17: ముక్కనుమ, మాస శివరాత్రి, ప్రదోష వ్రతం, సావిత్రి గౌరీ వ్రతం. 18: చొల్లంగి అమావాస్య.


