News January 21, 2025

అమితాబ్ అపార్ట్‌మెంట్‌కు రూ.83కోట్లు!

image

అమితాబ్ బచ్చన్ ముంబై ఓషివారాలోని తన డూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌ను ₹83కోట్లకు అమ్మేశారు. ఆయనకు 168% ప్రాఫిట్ వచ్చినట్లు తెలుస్తోంది. 2021 ఏప్రిల్‌లో ఆయన దీనిని ₹31కోట్లకు కొన్నారు. నవంబర్‌లో హీరోయిన్ కృతి సనన్‌కు నెలకు ₹10లక్షలకు రెంట్‌కు ఇచ్చారు. ఈ అపార్ట్‌మెంట్ విస్తీర్ణం 5,185 sq ft ఉంటుందని సమాచారం. కాగా బిగ్ బి ఫ్యామిలీ గత ఏడాది రియల్ ఎస్టేట్‌లో ₹100cr ఇన్వెస్ట్ చేసినట్లు వార్తలొస్తున్నాయి.

Similar News

News October 15, 2025

ఢిల్లీకి సంజూ? KKRకు కేఎల్ రాహుల్?

image

సంజూ శాంసన్‌ను దక్కించుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ ఆసక్తిగా ఉన్నట్లు జాతీయ మీడియా తెలిపింది. అక్షర్ స్థానంలో శాంసన్‌కు ఆ బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నట్లు సమాచారం. సంజూకు బదులు ఏ ప్లేయర్‌ను RRకు ట్రేడ్ చేయాలనే దానిపై సమాలోచనలు జరుపుతున్నట్లు టాక్. ఇక ఢిల్లీ స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ కోసం KKR ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు సమాచారం. ఆయనకు కెప్టెన్సీ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.

News October 15, 2025

సిరి సంపదలకు పునాది ‘వాస్తు’

image

వాస్తు బాగున్న ఇంట్లో నివసిస్తే వారికి సిరిసంపదలకు లోటుండదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ‘మంచి వాస్తు వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రభావవంతమైన ఆలోచనలు వస్తాయి. అవి అవకాశాలను సృష్టిస్తాయి. తద్వారా ఆదాయం పెరుగుతుంది. దీంతో మన జీవితంలో సౌకర్యాలు, సదుపాయాలు ఏర్పడతాయి. ఇవే అంతిమంగా మనకు ఆనందాన్ని, సంతృప్తిని అందిస్తాయి. వాస్తే మన సౌభాగ్యానికి తొలి మెట్టు’ అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>

News October 15, 2025

విప్లవం లేదు గిప్లవం లేదు: సీఎం మార్పుపై సిద్దరామయ్య

image

కర్ణాటక కాంగ్రెస్‌లో CM మార్పు అంశం నెలలో ఒక్కసారైనా తెరపైకి రావడం సర్వ సాధారణమైంది. ఇటీవల రాష్ట్రంలో కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నవంబర్‌లో విప్లవం (క్రాంతి) రాబోతోందని వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై సీఎం సిద్దరామయ్యను ఓ విలేకరి ప్రశ్నించగా ‘క్రాంతి లేదు భ్రాంతి లేదు’ అని కొట్టిపారేశారు. తానే సీఎంగా కొనసాగుతానని పునరుద్ఘాటించారు. నాయకత్వ మార్పుపై వచ్చేవన్నీ అసత్యాలేనని స్పష్టం చేశారు.