News January 31, 2025
AMP: కోనసీమలో 64,327 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు

ఉమ్మడి ఉ.గో. జిల్లాల పట్టభద్రుల MLC ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. 10 వరకు నామినేషన్ల దాఖలు, 11న నామినేషన్ల పరిశీలన, 13న నామినేషన్ల ఉపసంహరణ, 27న పోలింగ్ జరుగుతుంది. కూటమి తరపున టీడీపీ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్, పీడీఎఫ్ అభ్యర్థిగా డీవీ రాఘవులు బరిలో ఉన్నారు. కోనసీమలో 64,327 మంది ఓటర్లలో పురుషులు 37,069 మంది, మహిళలు 27,256 మంది, ఇతరులు ఇద్దరు ఉన్నారు.
Similar News
News October 21, 2025
బీజేపీ-ఆప్ మధ్య ‘పొల్యూషన్’ పంచాయితీ

ఢిల్లీలో పొల్యూషన్ సమస్య బీజేపీ, ఆప్ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. దీపావళి వేళ కాలుష్యాన్ని నియంత్రించడంలో ఢిల్లీ ప్రభుత్వం విఫలమైందని ఆప్ రాష్ట్రాధ్యక్షుడు సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. దీంతో ఆ పార్టీపై బీజేపీ ఎదురుదాడికి దిగింది. ఆప్ అధికారంలో ఉన్న పంజాబ్లో పంటల కాల్చివేత వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని మండిపడింది. పొల్యూషన్కు దీపావళిని బ్లేమ్ చేయొద్దని హితవు పలికింది.
News October 21, 2025
అమరుల త్యాగమే శాంతికి పునాది: KMR కలెక్టర్

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరుల కుటుంబ సభ్యులకు వారు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పోలీస్ అమరవీరుల త్యాగనిరతి వల్లే నేడు శాంతి, భద్రతలు నెలకొన్నాయని కలెక్టర్ పేర్కొన్నారు.
News October 21, 2025
జగిత్యాల: నక్సల్స్ ఎన్కౌంటర్లో SI వీరమరణం

జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో ఎస్ఐగా పనిచేసిన క్రాంతి కిరణ్ తన సేవా కాలంలో ప్రజా భద్రత కోసం అహర్నిశలు కృషి చేశారు. విధి నిర్వహణలో ఎప్పుడూ ధైర్యంగా ముందుండే ఆయన, పోలీసు శాఖలో క్రమశిక్షణ, నిబద్ధతకు నిదర్శనంగా నిలిచారు. తన విధుల్లో ఉన్న సమయంలో 1995 SEPT 29న రంగారావుపేటలో జరిగిన జనశక్తి నక్సల్స్ ఎన్కౌంటర్లో ఆయన అసువులు బాసారు. ఆయన ప్రాణత్యాగం ప్రజల మనసులో చెరగని ముద్ర వేసింది. SHARE IT.