News March 3, 2025

AMP: డాక్టర్ శర్మకు కలెక్టర్ అభినందనలు

image

56 దేశాల సభ్యత్వం కలిగిన కామన్వెల్త్ మెడికల్ అసోసియేషన్‌లో క్షయ వ్యాధి నివారణ కోసం 12 మంది సభ్యులతో ఉప సంఘం ఏర్పాటు చేశారు. భారతదేశం నుంచి ముగ్గురు డాక్టర్లను ఎంపిక చేశారు. వారిలో జిల్లా నుంచి డాక్టర్ పీఎస్ శర్మ సభ్యులుగా ఉండడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. సోమవారం అమలాపురంలో క్షయ వ్యాధి అపోహ నివారణపై ముద్రించిన ముద్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా శర్మను అభినందించారు.

Similar News

News December 19, 2025

రేపు పెరవలికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

image

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం పెరవలిలో పర్యటించనున్నారు. ఉదయం 9:20 గంటలకు మంగళగిరి నుంచి బయలుదేరి, 10:50 గంటలకు పెరవలి చేరుకుంటారు. రూ.3,040 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ‘అమరజీవి జలధార’ ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు తిరిగి మంగళగిరి బయలుదేరుతారని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.

News December 19, 2025

GNT: మోసం కేసు ఛేదించిన పోలీసులకు SP ప్రశంసలు

image

డిజిటల్ అరెస్ట్ పేరుతో జరిగిన సైబర్ మోసం కేసును సాంకేతికంగా ఛేదించి నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన ప్రత్తిపాడు, కాకుమాను పోలీసులను ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించారు. ఈ కేసులో సమర్థవంతంగా గుంటూరు పశ్చిమ డీఎస్పీ బానోదయ భానోదయ ఆధ్వర్యంలో దర్యాప్తు నిర్వహించిన పోలీస్ అధికారులు, సిబ్బందికి ఎస్పీ ప్రశంసా పత్రాలు అందజేసి ప్రత్యేకంగా ప్రశంసించారు.

News December 19, 2025

సుబ్రహ్మణ్యం.. అప్పన్న కలిసే కుట్ర చేశారు.?

image

తిరుమల కల్తీ నెయ్యి కేసులో ఏ-29 సుబ్రహ్మణ్యం, టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాజీ PA చిన్న అప్పన్న కలిసి ఉద్దేశపూర్వకంగా కుట్రచేశారని కోర్టులో వాదనలు జరిగాయని తెలుస్తోంది. ప్లాంట్ తనిఖీ చేయకుండా, డెయిరీలవారితో కలిసి తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా చేశారని సిట్ తేల్చినట్లు సమాచారం. దీని ప్రకారం కేసు ఓ కొలిక్కి వచ్చినట్లు న్యాయవాదులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.