News February 23, 2025
AMP: నేడు గ్రూప్-2 పరీక్ష..పావుగంట ముందే గేట్ క్లోజ్

రాష్ట్ర వ్యాప్తంగా నేడు గ్రూప్ -2 పరీక్ష జరగనుంది. ఉదయం 10.గ నుంచి 12.30 వరకు పేపర్-1, మధ్యాహ్నం 3.గ నుంచి 5.30 వరకు పేపర్-2 నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. పరీక్ష ప్రారంభానికి గంటన్నర ముందుగానే ప్రధాన గేట్లును మూసివేస్తామని నిర్వాహకులు ప్రకటించారు. పరీక్ష కేంద్రాల వద్ద బీసీఆర్పీసీ సెక్షన్ 163 అమల్లో ఉంటుందన్నారు. షెడ్యూలు ప్రకారమే పరీక్షలు జరుగుతాయని ఎపీపీఎస్సీ బోర్డు తెలిపింది.
Similar News
News December 3, 2025
బాబయ్య స్వామికి చాదర్ సమర్పించిన మంత్రి, కలెక్టర్

పెనుకొండలో బాబయ్య ఉరుసు మహోత్సవం మంగళవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సవిత, కలెక్టర్ శ్యాం ప్రసాద్ పాల్గొన్నారు. బాబాఫక్రుద్దీన్ గంధం మహోత్సవం సందర్భంగా మంత్రి, కలెక్టర్ బాబయ్య స్వామికి ప్రభుత్వం తరుఫున చాదర్ సమర్పించారు. మంత్రికి బాబయ్యస్వామి దర్గా వంశ పారంపర్య ముతవల్లి తాజ్ బాబా పూలమాల వేసి స్వాగతం పలికారు. అనంతరం దర్గాలో ప్రార్థనలు చేశారు.
News December 3, 2025
జగిత్యాల: డీసీసీ నియామక పత్రాన్ని అందుకున్న నందయ్య

జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఇటీవల నియమితులైన నందయ్యకు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం నియామక పత్రాన్ని అందజేశారు. హైద్రాబాద్ గాంధీ భవన్లో జరిగిన టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో నియామక పత్రాన్ని అందజేశారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేలా పాటుపడాలని సూచించారు.
News December 3, 2025
గన్నేరువరం: ‘క్రీడల్లోనూ బాలికలు ముందుండాలి’

బాలికలు చదువుతో పాటు క్రీడల్లోనూ ముందుండి, అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే పేర్కొన్నారు. స్నేహిత అవగాహన కార్యక్రమంలో భాగంగా మంగళవారం తిమ్మాపూర్ కేజీబీవీ, గన్నేరువరం పాఠశాలలను ఆమె సందర్శించారు. అన్ని రంగాల్లోనూ ప్రతిభ చూపాలని బాలికలకు సూచించారు. ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే హెల్ప్లైన్ నెంబర్లకు కాల్ చేయాలని కోరారు.


