News April 7, 2025

AMP: ముగిసిన విశాఖ విద్యా యాత్ర

image

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విద్యార్థుల విద్యా విజ్ఞానానికి దోహదపడేలా మూడు రోజుల విశాఖ విద్యా యాత్ర ఆదివారంతో ముగిసిందని డీఈఓ డాక్టర్ సలీం భాషా తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..విద్యార్థులు యానాం బొటానికల్ గార్డెన్, ఏటికొప్పాక బొమ్మల పరిశ్రమ, రుషికొండ బీచ్ , తొట్లకొండ బౌద్ధారామాలు, రామానాయుడు స్టూడియో, భీమిలి బీచ్ తదితర ప్రాంతాలు సందర్శించారన్నారు. జిల్లా సైన్స్ అధికారి జీవివి సుబ్రహ్మణ్యం ఉన్నారు.

Similar News

News October 22, 2025

కొత్తపేట పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్

image

వేటపాలెం (M) కొత్తపేట పంచాయతీ ఎన్నికలకు మంగళవారం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రామ పంచాయతీల పునర్విభజనపై 2021లో కొందరు కేసులు వేయడంతో ఎన్నికలు నిలిచిపోయాయి. కోర్టులో కేసులు తొలగిపోవడంతో అధికారులు ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేశారు. కొత్తపేటలో 16 వార్డులు ఉండగా సుమారు 11,500 ఓటర్లు ఉన్నారు. నవంబర్ 3న ఎన్నికలు నిర్వహించనున్నారు.

News October 22, 2025

ఖమ్మం: ఆ మండలాలకు కేంద్రం రూ.కోటి నజరానా

image

ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంలో భాగంగా అధిక సోలార్ ప్లాంట్‌లు కలిగిన గ్రామాలను మోడల్ గ్రామాలుగా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఖమ్మం నుంచి 8, భద్రాద్రి జిల్లా నుంచి 14 గ్రామాలు అర్హత సాధించాయి. చివరికి ఉమ్మడి ఖమ్మం నుంచి కొనిజర్ల, భద్రాచలం అధిక మొత్తంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తితో ముందు భాగాన నిలిచాయి. దీంతో ఆ రెండు మండలాలకు కోటి చొప్పున నజరానాను కేంద్ర ప్రభుత్వం అందజేయనుంది.

News October 22, 2025

పాలమూరు: మద్యం షాపు దరఖాస్తుల గడువు రేపటితో ముగింపు

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు ఈనెల 23తో ముగియనుంది. ఈసారి 10 వేలకు పైగా దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్ అధికారులు అంచనా వేయగా, గడువు పొడిగించినా ఇప్పటివరకు కేవలం 5,188 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. మరో రెండు రోజులు గడువు ఉండటంతో దరఖాస్తుల సంఖ్య పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.