News April 7, 2025

AMP: ముగిసిన విశాఖ విద్యా యాత్ర

image

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విద్యార్థుల విద్యా విజ్ఞానానికి దోహదపడేలా మూడు రోజుల విశాఖ విద్యా యాత్ర ఆదివారంతో ముగిసిందని డీఈఓ డాక్టర్ సలీం భాషా తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..విద్యార్థులు యానాం బొటానికల్ గార్డెన్, ఏటికొప్పాక బొమ్మల పరిశ్రమ, రుషికొండ బీచ్ , తొట్లకొండ బౌద్ధారామాలు, రామానాయుడు స్టూడియో, భీమిలి బీచ్ తదితర ప్రాంతాలు సందర్శించారన్నారు. జిల్లా సైన్స్ అధికారి జీవివి సుబ్రహ్మణ్యం ఉన్నారు.

Similar News

News November 19, 2025

‘అరట్టై’ నుంచి బిగ్ అప్డేట్..

image

దేశీ మెసేజింగ్ యాప్ ‘అరట్టై’లో బిగ్ అప్డేట్‌ను జోహో సంస్థ తీసుకొచ్చింది. ‌ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను ప్రవేశపెట్టింది. ఇకపై డైరెక్ట్ చాట్‌లకు ఎన్‌క్రిప్షన్ రక్షణ ఉంటుందని జోహో తెలిపింది. కొత్త వెర్షన్‌ను అప్డేట్ చేసుకోవాలని యూజర్లను కోరింది. ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ వల్ల మెసేజ్‌ను పంపినవారు, రిసీవ్ చేసుకున్న వారే చూస్తారని చెప్పింది. గ్రూప్ చాట్స్‌కూ త్వరలో అందుబాటులోకి తెస్తామని పేర్కొంది.

News November 19, 2025

ADB: ఆపదమిత్ర శిక్షణకు ధరఖాస్తుల ఆహ్వానం

image

విపత్తుల సమయంలో రక్షణ చర్యల్లో పాల్గొనేందుకు ఉద్దేశించిన ‘ఆపదమిత్ర’ ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ, భారత్ స్కౌట్స్ గైడ్స్ చీఫ్ కమీషనర్ రాజేశ్వర్ తెలిపారు. 18 నుంచి 40 సంవత్సరాల లోపు వయస్సు గల స్కౌట్ మాస్టర్లు, గైడ్ కెప్టెన్లు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవాలని, శిక్షణ హైదరాబాద్‌లో వారంపాటు ఉంటుందని వివరించారు.

News November 19, 2025

జైనథ్: 8 మంది దొంగల అరెస్ట్

image

ఈ నెల 14న జైనథ్‌లోని హాత్తిఘాట్ పంపుహౌస్ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. చోరీకి గురైన రూ.4.8 లక్షల సామగ్రిని రికవరీ చేశారు. మంగళవారం 12 మందిపై కేసు నమోదు చేసి, ఎనిమిది మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. దొంగిలించిన సామగ్రి, రెండు మొబైల్ ఫోన్లు, ఒక ఆటో, రూ.7,140 నగదును స్వాధీనం చేసుకున్నారు. సామగ్రి కొనుగోలు చేసిన స్క్రాప్ దుకాణదారుడిని కూడా రిమాండ్‌కు పంపినట్లు సీఐ శ్రావణ్ కుమార్ తెలిపారు.