News April 10, 2025
AMP: రైల్వే లైన్పై ఆర్డీవోలతో ఎంపీ హరీష్ సమీక్ష

కోటిపల్లి రైల్వే లైన్ భూసేకరణపై అంబేడ్కర్ కోనసీమలోని ఆర్టీవోతో ఎంపీ హరీష్ మాధుర్ బుధవారం సమీక్ష నిర్వహించారు. అమలాపురం ఆర్డీవో మాధవి, కొత్తపేట ఆర్డీవో శ్రీకర్లతో చర్చించారు. కోనసీమ రైల్వే లైన్ నిర్మాణ పనులకు సంబంధించి గత సమీక్ష సమావేశం తర్వాత జరిగిన పురోగతిపై ఆర్డీవోలు ఎంపీకి వివరించారు. తదుపరి కార్యాచరణ ప్రణాళిక, త్వరితగతిన భూసేకరణ పనులు పూర్తి చేయాలని ఎంపీ ఆదేశించారు.
Similar News
News November 4, 2025
జిల్లాలో 64,160 పశువులకు వ్యాధినివారణ టీకాలు

జిల్లాలో 64160 పశువులకు గాలికుంటు వ్యాధినివారణ టీకాలు వేసినట్లు, దీంతో 14383 మంది రైతులు లబ్ధిపొందినట్లు జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి కుమారస్వామి తెలిపారు. మంగళవారం పశువైద్యశాఖ డాక్టర్లు, సిబ్బందితో ఆయన అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈనెల 14 వరకు టీకాల కార్యక్రమం సాగుతుందని, జిల్లాలో 132285 పశువులు ఉన్నట్లు చెప్పారు. గ్రామాల్లో ఏర్పాటు చేసే శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అధికారి కోరారు.
News November 4, 2025
మాగాణి భూముల్లో వరికి ప్రత్యామ్నాయ పంటలు

వరి మాగాణి భూముల్లో ఆరుతడి పంటల సాగుతో అధిక లాభం పొందవచ్చని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. వరికి ప్రత్యామ్నాయంగా వేరుశనగ, ఆవాలు, నువ్వులు, శనగ, పెసలు, మినుము, జొన్న, సజ్జ, రాగులు, కొర్రలు, కూరగాయలు, పొద్దుతిరుగుడు, ఆముదం, పత్తి వంటి పంటలను ఎంపిక చేసుకోవాలని సూచిస్తున్నారు. వీటి సాగు వల్ల నేల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు రైతులకు విభిన్న పంటలతో ఆదాయం పెరుగుతుంది. వరి పంటపై ఆధారపడటం తగ్గుతుంది.
News November 4, 2025
మహిళల్లో ఫైనాన్షియల్ లిటరసీ పెంచాలని..

మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం లేకపోవడం కలిగే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఆర్థిక విషయాలపై అవగాహన కలిగిస్తే అది భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని ఇన్నర్ గాడెస్ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది అనన్య పరేఖ్. చెన్నైకు చెందిన అనన్య ఇంజనీరింగ్ తర్వాత మహిళల హక్కులు, సాధికారతపై దృష్టి పెట్టింది. వ్యవహార దక్షత నుంచి వ్యాపార నిర్వహణ వరకు వర్క్షాపులు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తూ ఎందరికో దారి చూపుతున్నారు.


