News April 25, 2025

AMP: సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో పనిచేయని సర్వర్లు

image

కోనసీమ జిల్లా వ్యాప్తంగా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సర్వర్లో పని చేయకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. దీంతో దూరప్రాంతాల నుంచి రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారు మండుటెండలో అవస్థలు పడ్డారు. సాంకేతిక లోపం వల్ల సర్వర్ ఆగిపోయిందని అధికారులు తెలిపారు. స్లాట్ బుక్ చేసుకున్న రిజిస్ట్రేషన్ లో ఆగిపోవడంతో ప్రజలు అధికారులను ప్రశ్నించారు. రిజిస్ట్రేషన్ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Similar News

News April 25, 2025

HYD: 15 రోజుల్లో 1,275 మంది మైనర్లపై కేసులు

image

నగర వ్యాప్తంగా మైనర్ల డ్రైవింగ్‌పై సిటీ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. 15 రోజులుగా వివిధ ప్రాంతాల్లో వాహనాలు నడుపుతున్న 1,275 మంది మైనర్లను గుర్తించి వారిపై కేసులు నమోదు చేశామని సిటీ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ తెలిపారు. వీరిపై ఛార్జిషీట్ దాఖలు చేసి కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. తల్లిదండ్రులు మైనర్‌లకు వాహనాలు ఇవ్వొద్దని మరోసారి హెచ్చరిస్తున్నారు.

News April 25, 2025

శిథిలావస్థలో హైదరాబాద్ చారిత్రక సంపద

image

పాతబస్తీలోని పురాతన భవనం పత్తర్‌గట్టి భవనం శిథిలావస్థకు చేరుకుంది. గత నెలలో పెచ్చులూడి పడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. 1911లో నిర్మించిన ఈ హెరిటేజ్ భవన సంరక్షణను ప్రభుత్వం పూర్తిగా వదిలేసిందని స్థానికులు చెబుతున్నారు. చార్‌కమాన్ల ఆధునీకరణలో భాగంగా 2009లో కేవలం రెండింటికి మాత్రమే మరమ్మతులు చేశారని తెలిపారు. HYD చారిత్రక సంపదను సంరక్షించాలని పలువురు కోరుతున్నారు.

News April 25, 2025

లింగాల: పడిపోయిన అరటికాయల ధరలు.. ఆవేదనలో రైతులు

image

అరటి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇటీవల బలమైన ఈదురుగాలులకు అరటి గెలులతో ఉన్న చెట్లు పడిపోగా.. ప్రస్తుతం అరటికాయల ధరలు పడిపోయాయి. అరటి రైతుల పరిస్థితి ‘గోరుచుట్టుపై రోకలి పోటు’ అన్న చందంగా తయారైంది. ప్రస్తుతం టన్ను అరటికాయల ధరలు నాలుగైదు వేలు పలుకుతున్నాయి. అరటి కాయలను ఉన్న ధరలకు అమ్ముదామనుకుంటే వాటిని కొనుగోలు చేసేందుకు వ్యాపారస్థులు ముందుకు రావడంలేదు.

error: Content is protected !!