News January 3, 2025
అమృత్పాల్ సింగ్ కొత్త పార్టీ?

ఖలిస్థానీ వేర్పాటువాది, ఎంపీ అమృత్పాల్ సింగ్ కొత్త పార్టీ పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 14న పంజాబ్లోని శ్రీ ముక్త్ సర్ సాహిబ్ జిల్లాలో జరిగే ఓ కార్యక్రమంలో పార్టీ పేరును అధికారికంగా ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి. కాగా అజ్నాలా పీఎస్పై దాడి కేసులో అరెస్టైన అమృత్ పాల్ సింగ్ దిబ్రూగఢ్ జైలులో ఉన్నారు. గత ఎన్నికల్లో జైలు నుంచే ఆయన పోటీ చేసి ఖడూర్ సాహిబ్ ఎంపీగా గెలుపొందిన విషయం తెలిసిందే.
Similar News
News October 25, 2025
నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు: APSDMA

AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం పలు మార్పుల తర్వాత ఎల్లుండికి తుఫానుగా మారే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ఈ ప్రభావంతో ఇవాళ కోనసీమ, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పింది. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
News October 25, 2025
ఐఐటీ బాంబేలో 53 పోస్టులు.. అప్లై చేశారా?

ఐఐటీ బాంబే 53 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 7వరకు అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, టెక్నికల్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్, Jr మెకానిక్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి వివిధ అర్హతలున్నాయి. వెబ్సైట్: https://www.iitb.ac.in/career/apply
News October 25, 2025
త్వరలో వెండిపైనా రుణాలు!

బంగారం మాదిరే వెండిపైనా బ్యాంకుల్లో లోన్లు తీసుకొనే అవకాశం తొందర్లోనే అందుబాటులోకి రానుంది. 2026 APR 1 నుంచి కమర్షియల్, కోఆపరేటివ్ బ్యాంకులు, NBFCలు, ఫినాన్స్ కంపెనీలు రుణం ఇచ్చేలా RBI గైడ్ లైన్స్ ఇచ్చింది. రూ.2.5లక్షల వరకు తీసుకునే రుణానికి వెండి మార్కెట్ విలువలో 85%, రూ2.5-రూ.5లక్షల మధ్య రుణానికి 80%, ఆపై 75% రుణం పొందొచ్చు. ఓ వ్యక్తి గరిష్ఠంగా 10KGల వరకు వెండిని హామీగా ఉంచి లోన్ తీసుకోవచ్చు.


