News October 29, 2024

CO2ను O2గా మార్చే కృత్రిమ ఆకు!

image

చెట్లు ఆక్సిజన్‌ను అందించి, కార్బన్‌డయాక్సైడ్‌ను స్వీకరిస్తుంటాయన్న విషయం తెలిసిందే. అయితే, కృత్రిమంగా అభివృద్ధి చేసిన ఆకులు నిజమైన వాటికంటే పది రెట్లు అధికంగా CO2ను గ్రహించాయి. చికాగోలోని ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయ పరిశోధకులు వీటిని రూపొందించారు. ఈ ఆకులోని ప్రత్యేకమైన పొర లోపల ఉన్న సాంకేతికత నీటి రూపంలో CO2ను గ్రహించి దీనిని ఆక్సిజన్‌గా మార్చుతుంది. ప్రస్తుతం ఇవి ప్రయోగదశలో ఉన్నాయి.

Similar News

News December 26, 2025

శిల్పాశెట్టి అసభ్యకర వీడియోలు.. వెంటనే తొలగించాలన్న కోర్టు

image

AI ఉపయోగించి తయారుచేసిన నటి శిల్పాశెట్టి డీప్‌ఫేక్ వీడియోల URLs, లింక్స్, పోస్టులను వెంటనే డిలీట్ చేయాలని సంబంధిత సైట్లను బాంబే HC ఆదేశించింది. ఆన్‌లైన్‌లో ఉన్న తన అసభ్యకర ఫొటోలు, వీడియోలను తొలగించాలని శిల్ప వేసిన పిటిషన్‌ను జస్టిస్ అద్వైత్ ఎం సేథ్నా వెకేషన్ బెంచ్ విచారించింది. ప్రాథమిక గోప్యత హక్కును ప్రభావితం చేసేలా ఒక వ్యక్తి/వ్యక్తిత్వాన్ని చిత్రీకరించకూడదని మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది.

News December 26, 2025

AI డిమాండ్‌కు AP సిద్ధంగా ఉంది: లోకేశ్

image

భారత ఉద్యోగులు AI టూల్స్‌ను అడాప్ట్ చేసుకోవడంలో అన్ని దేశాలను దాటేశారన్న వార్తపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ‘AI అడాప్షన్‌లో భారత్ దూసుకుపోవడం యాదృచ్ఛికం కాదు. గవర్నెన్స్, ఫిన్‌టెక్, హెల్త్, మొబిలిటీ వంటి అంశాల్లో వినియోగ స్థాయిని ఇది ప్రతిబింబిస్తోంది. ఈ డిమాండ్ AI హబ్స్, డేటా సెంటర్స్ ఏర్పాటుకు తోడ్పడనుంది. AI రెడీ DC ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, పవర్, ల్యాండ్‌తో AP సిద్ధం’ అని ట్వీట్ చేశారు.

News December 26, 2025

రైతు భరోసా పథకం రద్దు.. క్లారిటీ

image

TGలో రైతు భరోసా పథకాన్ని నిలిపివేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ప్రభుత్వానికి చెందిన ‘తెలంగాణ ఫ్యాక్ట్ చెక్’ ఖండించింది. అలాంటి వార్తలు పూర్తిగా అవాస్తవమని, నిరాధారమైనవని తేల్చిచెప్పింది. ప్రస్తుతం లబ్ధిదారులకు మాత్రమే సాయం అందేలా గ్రౌండ్ వెరిఫికేషన్ జరుగుతోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 65లక్షల మందికి పైగా ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని, సర్కార్ ఎలాంటి షరతులు విధించలేదని స్పష్టం చేసింది.